రైల్వేలో 2,700 మంది ఉద్యోగులకు కరోనా

దేశవ్యాప్తంగా 2,700 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా సోకిందని కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

రైల్వేలో 2,700 మంది ఉద్యోగులకు కరోనా
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2020 | 10:01 AM

దేశవ్యాప్తంగా 2,700 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా సోకిందని కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించిన రైల్వే శాఖ.. ఔషధాలు, ఇతర అత్యవసర వస్తువులను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసిందని.. ఈ క్రమంలోనే సిబ్బందికి వైరస్ సోకిందని అన్నారు. బీజేపీ తెలంగాణ శాఖ.. రాష్ట్రంలో ఉన్న ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు, కంపెనీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్‌లో గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కృషి వలనే దేశంలో ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉందని అన్నారు.

Read This Story Also: అమ్మ స‌ల‌హాతోనే ఆ పాత్ర‌లు చేస్తాను..