నేటి నుంచి బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవాలు..భక్తుల ఎంట్రీ?
హైదరాబాద్ బల్కంపేటలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవాలు సోమవారం నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులకు అనుమతి...

హైదరాబాద్ బల్కంపేటలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ కల్యాణోత్సవాలు సోమవారం నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, దేవతాహ్వానం, అంకుర్పారణ, గంగతెప్ప తదితర పూజలతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే, ప్రస్తుతం నగరంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఉత్సవాలను తిలకించేందుకు భక్తులను అనుమతిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అమ్మవారి కల్యాణోత్సవాల్లో రెండోరోజైన మంగళవారం ఎల్లమ్మ తల్లి కల్యాణాన్నిఆలయం లోపల మండపంలో వేదపండితులు నిర్వహించనున్నారు. బుధవారం అమ్మవారి రథోత్సవం దేవాలయం లోపలే నిర్వహిస్తారు. ఈ మూడు రోజులూ భక్తులకు అనుమతి లేదు. లక్షలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరగాల్సిన ఎల్లమ్మ కల్యాణం కరోనా వైరస్ కారణంగా ఆలయం లోపలే నిర్వహించాలని దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, అనేక రకాలైన పూలు, రంగులతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం ఈ మూడు రోజులూ భక్తులెవరూ దేవాలయం వద్దకు రావద్దని, దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బందులు పడొద్దని ఈఓ కుంట నాగరాజు, ఛైర్మన్ కొత్తపల్లి సాయిబాబా గౌడ్ సూచించారు. ఈ యేడు అమ్మవారి కల్యాణ్య సందర్భంగా భక్తులు ఇళ్లలోనే ఉండి పూజించుకోవాలని చెప్పారు.




