కరోనా ఎఫెక్ట్: మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం..
గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశానలు పట్టిపీడిస్తోంది. ఇటు భారత్లోనూ కోవిడ్ కారణంగా పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. దేశంలో విజృంభిస్తున్న కరోనా కారణంగా ప్రజలు ఇంటి నుండి కాళ్లు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఇటువంటి తరుణంలో

గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశానలు పట్టిపీడిస్తోంది. ఇటు భారత్లోనూ కోవిడ్ కారణంగా పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. దేశంలో విజృంభిస్తున్న కరోనా కారణంగా ప్రజలు ఇంటి నుండి కాళ్లు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఇటువంటి తరుణంలో ఉపాధి కూలీలు, కార్మికులు అనేక కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికులు కూడా స్వస్థలాలకు తిరిగి వచ్చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉపాధిలేని ఎంతో మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కరోనా కారణంగా 60ఏళ్లు పైబడిన వారిని కొన్ని చోట్లకు విధులకు అనుమతించటం లేదు. 60 ఏళ్లకు పైబడిన పారిశుధ్య కార్మికులు పనిలోకి రావొద్దని మునిసిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత కమిషనర్లను మునిసిపల్ శాఖ సంచాలకుడు సత్యనారాయణ ఆదేశించారు.
విస్తరిస్తున్న వైరస్ వ్యాప్తి కారణంగా పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్లో కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారని అధికారులు వెల్లడించారు. అయితే, 60 ఏళ్లకు పైబడిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యుల నుంచి ఎవరినైనా విధుల్లోకి తీసుకోవచ్చని వర్క్ ఏజెన్సీలకు మునిసిపల్ శాఖ సూచించింది. కొత్తగా పనిలోకి తీసుకునే కార్మికుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండేలా చూడాలని ఆదేశించింది. కుటుంబ సభ్యులు అందుబాటులో లేనిపక్షంలో ఇతరులను ఎంపిక చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.