మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తూనే ఉంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇక అందులోనూ పలువురు రాజకీయ నాయకులు వరుస పెట్టి కోవిడ్ మహమ్మారి బారిన పడుతూనే ఉంటున్నారు. తాజాగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి..
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తూనే ఉంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇక అందులోనూ పలువురు రాజకీయ నాయకులు వరుస పెట్టి కోవిడ్ మహమ్మారి బారిన పడుతూనే ఉంటున్నారు. తాజాగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్కు కరోనా సోకింది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్థారణ అయిందని ఆయనే స్వయంగా తెలిపారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. ఇక వెంటనే వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. కాగా ఇటీవలే తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని క్రిషన్ పోల్ సూచించారు. ఈ విషయంలో అశ్రద్ధ వహించవద్దన్నారు. అలాగే ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే హోమ్ క్వారంటైన్లో ఉండాలని పేర్కొన్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.
Read More:
కరోనా టెస్టుల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
బ్రేకింగ్ః గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారీ
మొత్తానికి ‘బీబీ’ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చిన నందు
జగనన్న విద్యాకానుక: విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ ఇవే