బ్రేకింగ్: సీబీఎస్ఈ 12వ తరగతి రిజల్ట్స్ రిలీజ్..
సీబీఎస్ఈకి చెందిన 12వ తరగతి రిజల్ట్స్ సోమవారం రిలీజ్ అయ్యాయి. రిజల్ట్స్ వివరాలను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. ఇక ఇప్పటికే సీబీఎస్ఈ బోర్డు కరోనా కారణంగా వాయిదా పడ్డ పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఇదే విషయాన్ని సీబీఎస్ఈ బోర్డు..
సీబీఎస్ఈకి చెందిన 12వ తరగతి రిజల్ట్స్ సోమవారం రిలీజ్ అయ్యాయి. రిజల్ట్స్ వివరాలను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. ఇక ఇప్పటికే సీబీఎస్ఈ బోర్డు కరోనా కారణంగా వాయిదా పడ్డ పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. ఇదే విషయాన్ని సీబీఎస్ఈ బోర్డు జూన్ 26వ తేదీన సుప్రీం కోర్డుకు తెలిపింది. ఇక పదో తరగతి ఫలితాలను కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. మరోవైపు సీబీఎస్ఈ సిలబస్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థుల్లోఒత్తిడి తగ్గించే కార్యక్రమంలో భాగంగా 30 శాతం సిలబస్ తగ్గించారు. ఇంటర్నల్ అసెస్మెంట్ ప్రక్రియ ఆధారంగా బోర్డు పరిణామాలుంటాయని సీబీఎస్ఈ బోర్డు ప్రకటించింది.
కాగా ఈ పరీక్షల్లో 38,686 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులను సాధించారని బోర్డు తెలిపింది. మొత్తంగా 88.78 శాతం మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. కాగా గతేడాది 83.40 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ సారి కొంత ఉత్తీర్ణత శాతం పెరిగింది. పరీక్షా ఫలితాలను వెల్లడించిన అనంతరం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్.
Central Board of Secondary Education (CBSE) Class 12 exam results announced. Overall Pass Percentage is 88.78%. pic.twitter.com/MKswRe5NpA
— ANI (@ANI) July 13, 2020
Read More: బ్రేకింగ్: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా..