Biological E: నవంబర్‌ నెలాఖరుకల్లా కరోనా టీకాల పంపిణీ ప్రారంభించబోతోన్న బయోలాజికల్‌-ఈ కంపెనీ

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మరింతగా తగ్గాయి.. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ కంపెనీ టీకా పంపిణీ నవంబర్‌ నెలాఖరుకల్లా ప్రారంభిస్తోంది.

Biological E: నవంబర్‌ నెలాఖరుకల్లా కరోనా టీకాల పంపిణీ ప్రారంభించబోతోన్న బయోలాజికల్‌-ఈ కంపెనీ
Biological E
Follow us

|

Updated on: Oct 25, 2021 | 9:53 PM

Corona Vaccine – Biological E: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మరింతగా తగ్గాయి.. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ కంపెనీ టీకా పంపిణీ నవంబర్‌ నెలాఖరుకల్లా ప్రారంభిస్తోంది. బెంగాల్‌లో నవంబర్‌ 15 నుంచి స్కూల్స్‌ తెరుచుకోనున్నాయి.. మరోవైపు రష్యా, చైనాల్లో కరోనా మహమ్మారి మరింతగా బుసలు కొడుతోంది. ఇలా ఉంటే, గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 27,641 కరోనా పరీక్షలు నిర్వహించగా 295 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఏపీలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 69 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 68, చిత్తూరు జిల్లాలో 40 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 560 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు చనిపోయారు.

ఇక, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 14,350 ఉండగా, 20,63,872 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 20,44,692 మంది కోలుకున్నారు. ఇంకా 4,830 మంది చికిత్స పొందుతున్నారు.

Read also: AP Education: ఉన్నత విద్యపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష.. యూనివర్సిటీల్లో టీచింగ్‌ స్టాప్‌ భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌