ప్రియమైన సోదరీమణులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలుః సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కచెళ్లమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కచెళ్లమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం జగన్. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ”తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్. ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వదినం రాఖీ పౌర్ణమి. కానీ ఈ కోవిడ్ మహమ్మారి వ్యాప్తిస్తోన్న నేపథ్యంలో రాఖీ పండుగ స్ఫూర్తిని కొనసాగిస్తూ, అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రియమైన సోదరీమణులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అని” జగన్ సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
The joyous festival of #RakshaBandhan celebrates the eternal bond of love between siblings. To protect one another has taken on a different meaning this year, amidst a pandemic, but the festive spirit remains the same. Greetings & lots of love to all my dear sisters across AP.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 3, 2020
Read More: ప్రపంచంపై కరోనా టెర్రర్.. ఉధృతంగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు