AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలయాలకు అనుమతి..! ఇవీ తప్పనిసరి నిబంధనలు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆలయాలు తెరుచుకోబోతున్నాయి. కోవిడ్‌ నిబంధనలను తప్పక పాటించేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా తిరుమలలో అధికారులు చర్యలు చేపట్టగా.. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనూ భక్తులు తప్పని సరిగా భౌతిక దూరం పాటిస్తూ.. దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేలా.. ప్రతీ భక్తుడికి దర్శనభాగ్యాన్ని కల్పించేలా చూస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులతో […]

ఆలయాలకు అనుమతి..! ఇవీ తప్పనిసరి నిబంధనలు
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2020 | 5:54 PM

Share

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆలయాలు తెరుచుకోబోతున్నాయి. కోవిడ్‌ నిబంధనలను తప్పక పాటించేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా తిరుమలలో అధికారులు చర్యలు చేపట్టగా.. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనూ భక్తులు తప్పని సరిగా భౌతిక దూరం పాటిస్తూ.. దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేలా.. ప్రతీ భక్తుడికి దర్శనభాగ్యాన్ని కల్పించేలా చూస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతీభక్తుడు వీఐపీయే నన్న మంత్రి.. అందరికీ సంతృప్తికరంగా దర్శనం చేయించేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పక పాటించాలని అధికారులకు సూచించారు. ఆలయాలకు వచ్చే చిన్నారులు, వృద్దుల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు మంత్రి వెల్లంపల్లి.

ఈ సందర్భంగా దేవాదాయ ఆస్తులపైన కూడా మాట్లాడారు…..దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. ఇప్పటికే దీనిపై సీఎం జగన్‌ పలు సూచనలు ఇచ్చారన్నారు. దేవాలయ భూములను కాపాడుకునేందుకు లీగల్‌ సమస్యల పరిష్కారానికి కమిషనర్‌ కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాలను పాటించాలని అధికారులకు హితవుపలికారు. ఆన్‌లైన్‌ సేవలు, డిజిటల్‌ ట్రాన్సక్షన్‌పై శ్రద్ద వహించాలన్న మంత్రి వృధా ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం