AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నుంచి కోలుకున్న ప్రముఖ నటుడి తల్లి..

తన ఫ్యామిలీ మొత్తం కరోనా మహమ్మారి బారిన పడినట్టు ట్వీట్ చేశారు. అనుపమ్ ఖేర్ తల్లి, సోదరుడు, వదిన, మేనకోడలకి కోవిడ్ సోకినట్టు తెలియజేశారు. అయితే తాజాగా కరోనా బారిన నుంచి అనుపమ్ ఖేర్ తల్లి దులారి కోలుకుని..

కరోనా నుంచి కోలుకున్న ప్రముఖ నటుడి తల్లి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 21, 2020 | 1:58 PM

Share

భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇటీవలే బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో జయ బచ్చన్ తప్ప మిగిలిన వారందరికీ కోవిడ్ నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అమితాబ్ ఫ్యాన్స్ మొత్తం షాక్‌కి గురయ్యారు.

ఈ వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్‌లో మరో ప్రముఖ నటుడు అనుమప్ ఖేర్.. తన ఫ్యామిలీ మొత్తం కరోనా మహమ్మారి బారిన పడినట్టు ట్వీట్ చేశారు. అనుపమ్ ఖేర్ తల్లి, సోదరుడు, వదిన, మేనకోడలకి కోవిడ్ సోకినట్టు తెలియజేశారు. అయితే తాజాగా కరోనా బారిన నుంచి అనుపమ్ ఖేర్ తల్లి దులారి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అనుపమ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. అలాగే ఆరోగ్య కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కష్ట సమయంలో తన తల్లి కోసం ప్రార్థన చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు. కాగా జులై 12వ తేదీన ఆమెకి కోవిడ్ సోకింది.

Read More:

ర్యాపిడ్ టెస్టుల కోసం క్యూ కడుతున్న జనం..

కరోనా ట్రీట్‌మెంట్ విషయంపై ఏపీ ప్రభుత్వ కీలక మార్గదర్శకాలు..