AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్ముకశ్మీర్‌ పోలీసులకు మరో టెన్షన్.. 55 మందికి కరోనా

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే  లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. అన్ని వర్గాల ప్రజలను ఇది ఎటాక్ చేస్తోంది. తాజాగా ఇది పోలీసులను కూడా టెన్షన్ పెడుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో కూడా ఈ కరోనా మహమ్మారి పోలీసులను భయపెడుతోంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో 55 మందికి కరోనా […]

జమ్ముకశ్మీర్‌ పోలీసులకు మరో టెన్షన్.. 55 మందికి కరోనా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2020 | 11:35 AM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే  లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా.. అన్ని వర్గాల ప్రజలను ఇది ఎటాక్ చేస్తోంది. తాజాగా ఇది పోలీసులను కూడా టెన్షన్ పెడుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే వెయ్యి మందికిపైగా పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో కూడా ఈ కరోనా మహమ్మారి పోలీసులను భయపెడుతోంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో 55 మందికి కరోనా సోకడంతో.. అక్కడి పోలీసులు టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కశ్మీర్ డివిజన్‌లో 94 కేసులు నమోదవ్వగా.. జమ్మూ డివిజన్‌లో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇదిలావుంటే.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 55 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ సోకింది. అంతేకాదు మరో ఐదుమంది వైద్యులకు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో మొత్తం 1289 కరోనా కేసులు నమోదయ్యాయి.

Follow Us