CBSE: పదో తరగతి విద్యార్థులకి షాక్.. అవి రిజల్ట్‌ కాదు.. థియరీ మార్కులు మాత్రమే..

CBSE: పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడించలేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం ఆన్‌లైన్‌లో ఎటువంటి ఫలితాలు ఉండవని స్పష్టం చేసింది.

CBSE: పదో తరగతి విద్యార్థులకి షాక్.. అవి రిజల్ట్‌ కాదు.. థియరీ మార్కులు మాత్రమే..
Cbse
Follow us

|

Updated on: Mar 13, 2022 | 11:32 PM

CBSE: పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడించలేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం ఆన్‌లైన్‌లో ఎటువంటి ఫలితాలు ఉండవని స్పష్టం చేసింది. కేవలం ప్రాక్టికల్ మార్కులు, థియరీ పరీక్షల ఫలితాలను మాత్రమే పాఠశాలలకు తెలియజేశామని సీబీఎస్ఈ ప్రతినిధి రామశర్మ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి CBSE జాయింట్ సెక్రటరీ సన్యామ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. 10, 12 తరగతులకు సంబంధించిన టర్మ్ 1, టర్మ్ 2 పరీక్షలు పూర్తికాకుండా ఫలితాలను విడుదల చేయలేమని చెప్పారు. ఫలితాల ప్రకటన అంటే ఏదైనా సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత లేదా ఫెయిల్ కావడం లేదా కంపార్ట్‌మెంట్ పొందడం గురించి విద్యార్థులకు సమాచారం అందించడం. అయితే ఇది టర్మ్ 2 పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే బోర్డు వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. ఎడ్యుకేషన్ ఈ మెయిల్ ఐడిల ద్వారా పాఠశాలలకు పంపిన మార్కుల విషయానికొస్తే ఇవి కేవలం థియరీ స్కోర్‌లు మాత్రమేనని, వీటిని సిబిఎస్‌ఈ పాఠశాలలకు పంపించిందని భరద్వాజ్ తెలిపారు.

అయితే 10, 12 బోర్డు ఫలితాలు ఎప్పుడు వస్తాయని అడిగిన ప్రశ్నకి భరద్వాజ్ సమాధానం చెప్పారు. పరీక్ష పూర్తయిన తర్వాతే తుది ఫలితాలను CBSE విడుదల చేస్తుందని అన్నారు. విద్యార్థులు తమ టర్మ్ 2 పరీక్షకు హాజరు కానప్పుడు ఫలితాలు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. రెండో సెషన్ పరీక్షల మార్కులతో పాటు పూర్తి ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. ఈరోజు విడుదల చేసిన థియరీ మార్కుల వల్ల టర్మ్ 2 పరీక్షలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తారని తెలిపారు. అంతేకాకుండా 12వ తరగతి టర్మ్ 1కి కూడా థియరీ స్కోర్‌లను సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అయితే వాటిని పాఠశాలలకు పంపడానికి కొంత సమయం పడుతుందన్నారు. టర్మ్ 1 థియరీలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని, టర్మ్ 2లో మరింత మెరుగ్గా రాణించగలరని కోరారు. CBSE బోర్డు పరీక్షలు రెండు టర్మ్‌లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టర్మ్ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతాయి.

Sonia Gandhi: కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియానే.. సీడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయాలు..

White Hair: షాంపూలో వీటిని మిక్స్‌ చేసి వాడితే తెల్లజుట్టు నల్లగా మారుతుంది..!

IND vs SL: ఈ గ్రౌండ్‌లోనైనా సెంచరీ చేస్తాడా.. అభిమానుల కోరిక నెరవేరుస్తాడా..

డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం