AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group 1 Last Date: మరికాసేపట్లో ముగుస్తోన్న టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు.. అప్లికేషన్‌ లింక్‌ ఇదే

తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు నేటితో (మార్చి 14)తో ముగుస్తోంది. గురువారం సాయంత్రం 5 గంటలతో అప్లికేషన్‌ విండో క్లోజ్‌ అవనుంది. దీంతో ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ఈ రోజు గ్రూప్‌ 1 అప్లికేషన్‌లకి చివరి రోజని, అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని..

TSPSC Group 1 Last Date: మరికాసేపట్లో ముగుస్తోన్న టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు.. అప్లికేషన్‌ లింక్‌ ఇదే
TSPSC Group 1
Srilakshmi C
|

Updated on: Mar 14, 2024 | 6:07 PM

Share

హైదరాబాద్‌, మార్చి 14: తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు నేటితో (మార్చి 14)తో ముగుస్తోంది. గురువారం సాయంత్రం 5 గంటలతో అప్లికేషన్‌ విండో క్లోజ్‌ అవనుంది. దీంతో ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ఈ రోజు గ్రూప్‌ 1 అప్లికేషన్‌లకి చివరి రోజని, అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని సూచించారు. ఇంతకు ముందు అప్లై చేసిన వారు ఎలాంటి రుసుము లేకుండా మరోసారి అప్లికేషన్‌ నింపాలని ఆయన కోరారు.

టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్‌ ఫిబ్రవరి 19వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించిన కమిషన్‌ మార్చి 14 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో డువు విధించింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొత్తగా విద్యార్హత పొందిన అభ్యర్ధులు కూడా గ్రూప్‌ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్‌ సూచించింది. కాగా మార్చి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.70 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 2022 ఏప్రిల్‌లో గత ప్రభుత్వం జారీ చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు 3.80 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అయితే చివరిరోజున భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈసారి కూడా అలాగే జరగవచ్చని టీఎస్‌పీఎస్సీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే గ్రూప్‌ 1 పరీక్ష రెండు సార్లు రద్దు కావడంతో అభ్యర్ధులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒకసారి పేపర్‌ లీకేజీ, మరోసారి నిబంధనలు సరిగా పాటించలేదని ప్రిలిమ్స్‌ పరీక్షను కోర్టు రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం గతంలో ఇచ్చిన 503 పోస్టులకు మరో 60 పోస్టులను కలిపి ఫ్రెష్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో మొత్తం గ్రూప్‌ 1 పోస్టుల సంఖ్య 563కి చేరింది. ఇక ఇప్పటికే గ్రూప్‌ 1 పోస్టులకు ఆయా కేటగిరీల్లో సర్కార్ వయోపరిమితి పెంచింది కూడా. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు తుది గడువు ముగుస్తోంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.