AP Mega DSC 2025 Application: మెగా డీఎస్సీ దరఖాస్తుల్లో కొర్రీలు.. తలలు పట్టుకుంటున్న అభ్యర్ధులు!
ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 16,347 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను గత నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైననాటి నుంచి అభ్యర్ధులు పలు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్లికేషన్ విధానంలో పలు సవరణలు కోరుతూ అభ్యర్ధులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు..

అమరావతి, మే 7: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 16,347 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను గత నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైననాటి నుంచి అభ్యర్ధులు పలు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తొలుత సర్టిఫికెట్ల అప్లోడింగ్లో ఇబ్బందులు రావడంతో మంత్రి లోకేష్.. దీని నుంచి ఉపశమనం ఇస్తూ సర్టిఫికెట్ల అప్లోడింగ్ కేవలం అప్షనల్ మాత్రమేనని చెప్పడంలో అంతా కాస్త రిలీఫ్ పొందారు. కానీ ప్రస్తుతం మరోరకం సమస్య తల నొప్పిగా మారింది.
అదేంటంటే.. దరఖాస్తులో పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నంబర్ వివరాలు తప్పుగా నమోదు చేసిన వారు.. వాటిని తిరిగి సరి చేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తునునింపే సమయంలో తొందరపాటులో కొందరు పేరు, చిరునామా వంటి వివరాలు తప్పులు నమోదు చేశారు. వాటిని ఎడిట్ చేసుకునేందుకు అవకాశమిచ్చిన విద్యాశాఖ.. పుట్టిన తేదీ, ఆధార్ నంబరు ఎడిట్కు మాత్రం ఐచ్ఛికం ఇవ్వలేదు. దీంతో ఆ వివరాలను సరిదిద్దుకునే వెసులుబాటు లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు.
డీఎస్సీలో బీఎస్సీ కంప్యూటర్స్కీ అవకాశం కల్పించాలంటూ అభ్యర్ధుల విన్నతులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ భర్తీలోని భౌతికశాస్త్రం టీచర్ పోస్టుల నియామకాల్లో బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన అభ్యర్థులకు అర్హత కల్పించేలా సవరణ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. అలాగే అభ్యర్థుల వయోపరిమితిని కూడా 47 ఏళ్లకు పెంచాలని అందులో కోరారు. ఫిజిక్స్ టీచర్ పోస్టుల భర్తీలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివి, బీఈడీలో సంబంధిత మెథడాలజీ చదివి ఉండాలనేది నోటిఫికేషన్లో అర్హతగా నిర్ణయించారు. దీంతో బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి అర్హతలేకుండా పోయింది. అయితే బీసీఏ చదివిన వారికి ఛాన్స్ ఇచ్చారు. బీసీఏలో ఫిజిక్స్, కెమిస్ట్రీ రెండూ ఉండవు.. అయినా వారికి అవకాశం కల్పించారు. బీఎస్సీ కంప్యూటర్స్లో ఫిజిక్స్ సబ్జెక్టు ఉంటుంది కానీ కెమిస్ట్రీ లేదు. బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు అనర్హులైతే, బీసీఏ అభ్యర్థులు ఎలా అర్హులయ్యారో అర్థంకావడంలేదని.. ఈ పక్షపాతం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బీసీఏ చదివిన వారు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలనే నిబంధన పెట్టారు. బీఎస్సీ చదివిన వారు సైతం ఇంటర్లో ఎంపీసీ చదువుతారు. అందువల్ల డీఎస్సీలో ఫిజిక్స్ సబ్జెక్టుకు కంప్యూటర్ సైన్స్ వారికి సైతం అవకాశం కల్పించాలని అభ్యర్ధులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కాగా మెగా డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తులు
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.