AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Practical Exams 2026: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్‌ ప్రాక్టికల్స్..!

రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి..

Inter Practical Exams 2026: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్‌ ప్రాక్టికల్స్..!
Andhra Pradesh Intermediate Practical Examinations
Srilakshmi C
|

Updated on: Jan 06, 2026 | 3:15 PM

Share

అమరావతి, జనవరి 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు.

అయితే ఈసారి ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యదర్శి రంజిత్‌ బాషా జూనియర్ కాలేజీలను ఆదేశించారు. ఈ మేకు పబ్లిక్‌ పరీక్షలు, ఇంటర్మీడియట్‌ విద్యలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై జనవరి 5న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతలుగా ప్రాక్టికల్స్‌ జరుగుతాయని, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఈ సీసీ కెమెరాలను బోర్డులోని కార్యాలయానికి అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్‌లో అవకతవకల కట్టడికి ఈ మేరకు ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని, వీటిల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను పెడతామని బోర్డు తెలిపింది. రాష్ట్ర కార్యాలయం నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తామని తెలిపింది. కాగా ఈ ఏడాది ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఆయా తేదీల్లో జరగనున్నాయి. అయితే ఇంర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు ఈ ఏడాది పలు మార్పులతో జరగనున్నాయి. ఈ కొత్త మార్పులను అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకొని విధులు నిర్వర్తించాలని బోర్డు సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చేపల వాసనతో ఇబ్బందా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో స్మెల్‌ మాయం!
చేపల వాసనతో ఇబ్బందా.. ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో స్మెల్‌ మాయం!
ప్రపంచంలోని ఈ నాలుగు ప్రదేశాల్లో బంగారం ఫ్రీ! 2 మన భారతదేశంలోనే..
ప్రపంచంలోని ఈ నాలుగు ప్రదేశాల్లో బంగారం ఫ్రీ! 2 మన భారతదేశంలోనే..
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో!
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో!
పీఎం కిసాన్ మీకు వస్తాయో.. లేదో.. క్షణాల్లోనే ఇలా తెలుసుకోండి
పీఎం కిసాన్ మీకు వస్తాయో.. లేదో.. క్షణాల్లోనే ఇలా తెలుసుకోండి
మృత్యుంజయుడే.. ఒకేరోజు చావు అంచుల వరకు వెళ్లిన కమల్..
మృత్యుంజయుడే.. ఒకేరోజు చావు అంచుల వరకు వెళ్లిన కమల్..
మొబైల్ వేగం పెంచే టాప్ సీక్రెట్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
మొబైల్ వేగం పెంచే టాప్ సీక్రెట్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
రూమర్లకు రుణపడి ఉంటానంటూ సెటైర్లు వేసిన సీతారామం బ్యూటీ
రూమర్లకు రుణపడి ఉంటానంటూ సెటైర్లు వేసిన సీతారామం బ్యూటీ
పక్షులకు హాని చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండిలా!
పక్షులకు హాని చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండిలా!
పోల్ డ్యాన్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే!
పోల్ డ్యాన్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే!
పేరెంట్స్ గొడవలతో పిల్లల్లో ఆందోళన.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటే..
పేరెంట్స్ గొడవలతో పిల్లల్లో ఆందోళన.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటే..