AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Practical Exams 2026: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్‌ ప్రాక్టికల్స్..!

రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి..

Inter Practical Exams 2026: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. సీసీ కెమెరాల నిఘాలో ఇంటర్‌ ప్రాక్టికల్స్..!
Andhra Pradesh Intermediate Practical Examinations
Srilakshmi C
|

Updated on: Jan 06, 2026 | 3:15 PM

Share

అమరావతి, జనవరి 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, వృత్తివిద్యా కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతలుగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు.

అయితే ఈసారి ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరిగే కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యదర్శి రంజిత్‌ బాషా జూనియర్ కాలేజీలను ఆదేశించారు. ఈ మేకు పబ్లిక్‌ పరీక్షలు, ఇంటర్మీడియట్‌ విద్యలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై జనవరి 5న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు రెండు విడతలుగా ప్రాక్టికల్స్‌ జరుగుతాయని, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఈ సీసీ కెమెరాలను బోర్డులోని కార్యాలయానికి అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్‌లో అవకతవకల కట్టడికి ఈ మేరకు ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని, వీటిల్లో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను పెడతామని బోర్డు తెలిపింది. రాష్ట్ర కార్యాలయం నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తామని తెలిపింది. కాగా ఈ ఏడాది ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఆయా తేదీల్లో జరగనున్నాయి. అయితే ఇంర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు ఈ ఏడాది పలు మార్పులతో జరగనున్నాయి. ఈ కొత్త మార్పులను అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకొని విధులు నిర్వర్తించాలని బోర్డు సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పహల్గామ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? QR కోడ్ వెరిఫికేషన్ కొత్త రూల్
పహల్గామ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? QR కోడ్ వెరిఫికేషన్ కొత్త రూల్
ఇంటినుంచి బయటకు వచ్చిన యజమాని.. గుమ్మం ముందు సీన్‌ చూసి షాక్‌
ఇంటినుంచి బయటకు వచ్చిన యజమాని.. గుమ్మం ముందు సీన్‌ చూసి షాక్‌
అనంతపురంలో అద్భుతం.. మండువేసవిలో ఉప్పొంగిన జలధార..
అనంతపురంలో అద్భుతం.. మండువేసవిలో ఉప్పొంగిన జలధార..
చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. కాంతారా హీరో ప్రశంసలు
చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. కాంతారా హీరో ప్రశంసలు
థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీ రికార్డులు బద్దలు..
థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీ రికార్డులు బద్దలు..
ఛార్జింగ్‌ ఫుల్‌ అవ్వగానే ఆటోమేటిక్‌ ఆఫ్‌.. మీ ఫోన్‌ సేఫ్‌!
ఛార్జింగ్‌ ఫుల్‌ అవ్వగానే ఆటోమేటిక్‌ ఆఫ్‌.. మీ ఫోన్‌ సేఫ్‌!
వాడు అలా కొడతాడని ఊహించలే.. కాపీ చేసి దెబ్బతిన్న: రిషబ్ పంత్
వాడు అలా కొడతాడని ఊహించలే.. కాపీ చేసి దెబ్బతిన్న: రిషబ్ పంత్
పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది..
ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది..
పనికిరాని బల్బులను పారేస్తున్నారా?మీ ఇంటిని అందంగా అలంకరించండిలా!
పనికిరాని బల్బులను పారేస్తున్నారా?మీ ఇంటిని అందంగా అలంకరించండిలా!