AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAICLAS: నిరుద్యోగులకు సదావకాశం.. డిగ్రీ అర్హతతో 600 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన 400 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

AAICLAS: నిరుద్యోగులకు సదావకాశం.. డిగ్రీ అర్హతతో 600 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
AAICLAS
Srilakshmi C
|

Updated on: Mar 12, 2023 | 1:45 PM

Share

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన 400 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు సాధించిస్తే సరిపోతుంది. దరఖాస్తుదారుల వయసు మార్చి 19, 2023వ తేదీ నాటికి 27 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 19, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌ పూర్తిచేసే సమయంలో జనరల్‌ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.750లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, రిజర్వేషన్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.30,000ల నుంచి రూ.34,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.