AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Internship: 280 కంపెనీలు, లక్షకుపైగా అవకాశాలు.. పీఎం ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌ఫిస్‌ పేరుతో పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా దేశంలోని పలు కార్పొరేట్ కంపెనీల్లో ఇంటర్న్ షిప్ అవకాశాలు కల్పించనున్నారు. ఈ ప్రోగ్రామ్ లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 280 కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. లక్షకుపైగా ఇంటర్న్ షిప్ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి..

PM Internship: 280 కంపెనీలు, లక్షకుపైగా అవకాశాలు.. పీఎం ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో
Pm Internship Program
Narender Vaitla
|

Updated on: Oct 23, 2024 | 11:40 AM

Share

దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌ఫిస్‌ పేరుతో పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.2024-25 బడ్జెట్‌లో ఇందుకు సంబంధించి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 5వేల చొప్పున అందిస్తారు. అలాగే గ్రాంట్ కింద రూ. 6వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.

ఇప్పటికే ఇందుకు సంబంధించి ధరఖాస్తుల స్వీకరణ కూడా మొదలైంది. ఇక దేశంలోని దిగ్గజ ప్రవేట్‌ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ను అందిస్తారు. అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా ఎందులో ఇటర్న్‌షిప్‌ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా పీఎం ఇంటర్న్‌సిప్‌ పథకంలో భాగంగా కార్పొరేట్‌ భాగస్వామ్యం కోసం ప్రారంభించిన ఆన్‌బోర్డింగ్ విండోను అధికారులు మూసేశారు. ఇందులో ఇప్పటి వరకు మొత్తం 280 కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 1,27,046 ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

పైల్‌ ప్రోగ్రామ్‌లో కార్పొరేట్‌ కంపెనీలు భాగస్వామ్యమయ్యేందుకు పీఎమ్‌ఐఎస్‌ పోర్టల్‌ www.pminternship.mca.gov.inని అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించారు. ఇందులో ఆయా కంపెనీలు తమ సంస్థల్లో ఇంటర్న్‌ షిప్‌ అవకాశాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని రిజిస్టర్‌ చేసుకున్నాయి. ఇక పీఎమ్‌ఐస్‌ పథకం ద్వారా అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్‌ 12న ప్రారంభమైంది. ఈ ప్రక్రియ అక్టోబర్‌ 25వ తేదీ వరకు కొనసాగనుంది.

కాగా అక్టోబర్‌ 27 తేదీ నుంచి నవంబర్‌ 7వ తేదీ వరకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దేశంలోని అన్ని ప్రధాన రంగాలకు చెందిన సంస్థలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. ముఖ్యంగా అగ్రి కల్చర్, ఆటోమోటివ్, ఏవియేషన్ అండ్ డిఫెన్స్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్, సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, కెమికల్ ఇండస్ట్రీ, టాటా, రిలయన్స్, ఏషియన్ పేయింట్స్, ఇన్ఫోసిన్, హెచ్ డీఎఫ్ సీ, టెక్స్ టైల్, టెలికాం, మహీంద్రా, హీరో వంటి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ను అందించనున్నారు. ఇందుకోసం కేంద్రం రూ. 800 కోట్లు కేటాయించింది.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
అవిసె గింజల పొడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఈ వ్యాధులు మటుమాయం
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
Chanakya Niti: ఓటమిని కూడా విజయంగా మార్చే సూత్రాలు ఇవే
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి