AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mustard Oil: రానున్న రోజుల్లో పెరగనున్న ఆవాల నూనె ధర.. కారణం ఏంటో తెలుసా..?

భారతదేశం తరచుగా దిగుమతుల ద్వారా నూనె అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. ఒక్కోసారి దిగుబడి తక్కువగా ఉండడం ఇందుకు ఒక కారణం కాగా, అప్పుడప్పుడు వాతావరణం కారణంగా రెండోది. ఇటీవల ఉత్తర భారతంలో కురిసిన..

Mustard Oil: రానున్న రోజుల్లో పెరగనున్న ఆవాల నూనె ధర.. కారణం ఏంటో తెలుసా..?
Mustard Oil
Subhash Goud
|

Updated on: Apr 02, 2023 | 2:34 PM

Share

భారతదేశం తరచుగా దిగుమతుల ద్వారా నూనె అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. ఒక్కోసారి దిగుబడి తక్కువగా ఉండడం ఇందుకు ఒక కారణం కాగా, అప్పుడప్పుడు వాతావరణం కారణంగా రెండోది. ఇటీవల ఉత్తర భారతంలో కురిసిన వర్షం రైతులను అతలాకుతలం చేసింది. దీంతో మండీలకు కందుల రాక తగ్గుతోంది. రానున్న రోజుల్లో వంటనూనె ధరలు పెరగనున్నాయా..? మార్కెట్‌ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం.

పిటిఐ వార్తల ప్రకారం, ఆవాలు, సోయాబీన్ వంటి ఉత్పత్తులను రైతులు విక్రయించడం తగ్గిపోతుంది. అంటే మండీలకు సరుకుల రాక తక్కువగా ఉంటుంది. ఎండిన పంటపై వర్షం ప్రభావం పడడమే ఇందుకు ప్రధాన కారణం. ఢిల్లీ చమురు-నూనె గింజల మార్కెట్‌లో ఆవాలు, సోయాబీన్ నూనెగింజలు, పత్తి గింజల వంటి దేశీయ నూనెగింజలు కాకుండా దిగుమతి చేసుకున్న ముడి పామాయిల్, పామోలిన్ ధరలలో మెరుగుదల ఉంది. కాగా దేశీ వేరుశనగ నూనె, నూనెగింజలు, సోయాబీన్ నూనెల ధరలు మునుపటి స్థాయిలోనే ముగిశాయి.

మార్కెట్ వర్గాల ప్రకారం.. వర్షం కారణంగా ఆవాలు పంట దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నష్టం 10-12 శాతం ఉండవచ్చు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శనివారం ఢిల్లీలోని నూనెగింజల మార్కెట్‌లో ప్రధాన వస్తువుల ధరలు ఇలా ఉన్నాయి.

ఆవాలు నూనె గింజలు – క్వింటాల్‌కు రూ.5,460-రూ.5,535, వేరుశనగ – క్వింటాల్‌కు రూ. 6,815-రూ.6,875, వేరుశనగ నూనె మిల్లు డెలివరీ (గుజరాత్) – క్వింటాల్‌కు రూ. 16,700, వేరుశనగ శుద్ధి చేసిన నూనె టిన్‌కు రూ.2,545-రూ.2,810, ఆవాల నూనె దాద్రీ – క్వింటాల్‌కు రూ. 10,950. ఆవాలు పక్కి ఘనీ – ఒక్కో టిన్ రూ. 1,715-1,785. పచ్చి ఆవాలు – ఒక్కో టిన్ రూ. 1,715-రూ.1,835గా ఉంది. నువ్వుల నూనె మిల్లు డెలివరీ – క్వింటాల్‌కు రూ. 18,900-రూ.21,000, సోయాబీన్ ఆయిల్ మిల్లు డెలివరీ ఢిల్లీ – క్వింటాల్‌కు రూ.11,250. సోయాబీన్ మిల్ డెలివరీ ఇండోర్ – క్వింటాల్‌కు రూ. 11,100, సోయాబీన్ నూనె దేగం, కండ్ల – క్వింటాలుకు రూ.9,600, సీపీఓ ఎక్స్-కాండ్ల – క్వింటాలుకు రూ.8,950, పత్తి గింజల మిల్లు డెలివరీ (హర్యానా) – క్వింటాల్‌కు రూ. 9,850, పామోలిన్ ఆర్‌బిడి, ఢిల్లీ – క్వింటాల్‌కు రూ. 10,400. పామోలిన్ ఎక్స్- కండ్ల – క్వింటాల్‌కు రూ. 9,550 (జిఎస్‌టి లేకుండా). సోయాబీన్ ధాన్యం – 5,360-5, క్వింటాల్‌కు రూ.535. సోయాబీన్ లూజ్ – క్వింటాలుకు రూ.5,120-5,160. మొక్కజొన్న ఖల్ (సరిస్కా) – క్వింటాల్‌కు రూ. 4,010.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి