AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా..? పొరపాటున ఈ పనులు చేస్తే నేరమే..!

Indian Railway: చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే తక్కువ ఛార్జీ ఉండటం. అలాగే అలసట లేకుండా ప్రయాణం ఉంటుంది. చాలా..

Indian Railway: మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా..? పొరపాటున ఈ పనులు చేస్తే నేరమే..!
Subhash Goud
|

Updated on: Apr 25, 2022 | 12:45 PM

Share

Indian Railway: చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే తక్కువ ఛార్జీ ఉండటం. అలాగే అలసట లేకుండా ప్రయాణం ఉంటుంది. చాలా మంది ముందుస్తుగా రిజర్వేషన్లు చేసుకుని ప్రయాణిస్తుంటారు. అయితే రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. పొరపాటున కొన్ని పనులు చేస్తే జరిమానా (Fine) చెల్లించుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి ఈ విషయాలు పెద్దగా తెలియకపోవచ్చు. ఇంకా అవసరమైతే జైలు శిక్ష కూడా పడుతుంది. ఈ పనులు ఏమిటో తెలుసుకుందాం.

  1. సాధారణ టికెట్‌ తీసుకుని ఏసీలో ప్రయాణిస్తే..:  కొందరు సాధారణ టికెట్‌ తీసుకుని ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తారు. అలా ప్రయాణించినా నేరమే. రైల్వే యాక్టులో సెక్షన్‌ 137 ప్రకారం జరిమానా విధిస్తారు రైల్వే అధికారులు.
  2.  రైలులో పోస్టర్లు అతికించడం: రైలు ప్రయాణం చేసేటప్పుడు మీకు అక్కడక్కడ పోస్టర్లు కనిపిస్తుంటాయి. అలాంటి పోస్టర్లు అతికించడం కూడా తప్పే. రైల్వే యాక్టులో సెక్షన్‌ 166 (B) ప్రకారం.. రూ.500 జరిమానా లేదా ఆరు నెలలో జైలు శిక్ష వేయవచ్చు.
  3. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులను తీసుకెళ్లడం: సాధారణంగా కొందరు రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని వస్తువులను వెంట తీసుకెళ్లరాదు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఏవైనా వస్తువులు తీసుకెళ్లినట్లయితే జరిమానా వేస్తారు. ఉదాహరణకు.. పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ సిలిండర్‌ వంటివి. అలాగే రైళ్లలో సిగరెట్‌ కాల్చడం కూడా తప్పే.
  4. టికెట్‌ లేకుండా ప్రయాణం: కొందరు రైలు ప్రయాణం చేసే సమయంలో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తారు. టికెట్‌ లేని సమయంలో టీసీ వచ్చి జరిమానా వేసే అవకాశం ఉంది. ఇలా టికెట్‌ లేకుండా ప్రయాణించడం తప్పే. రైల్వే యాక్టులోని సెక్షన్‌ 138 ప్రకారం శిక్ష వేస్తారు.
  5. రైలులో చెత్తవేయడం:  రైలు ప్రయాణం చేసే సమయంలో తోటి ప్రయాణికులకు ఇబ్బందికరమైన పనులు చేయడం తప్పుగా భావించబడుతుంది. అలాగే రైలులో చెత్త వేయడం కూడా నేరమే. రైల్వే చట్టంలోని సెక్షన్‌ 145(B) ప్రయాణం శిక్షార్హం. మొదటిసారిగా తప్పు చేస్తే రూ.100, రెండోసారి తప్పు చేస్తే రూ.250 వరకు జరిమానా విధిస్తారు రైల్వే అధికారులు. లేదంటే నెల రోజుల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఎక్కువ శాతం శిక్ష విధించకపోయినా జరిమానా మాత్రం విధిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Aadhaar Card: ఆధార్‌ కార్డులో రకాలు .. ఒక్కో కార్డుకు ఒక్కో ఫీచర్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి

PM Ujjwala Yojana: నిరుపేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు.. దరఖాస్తు చేసుకోండిలా..

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!