Union Budget 2026: సీనియర్ సిటిజన్లకు శుభవార్త? ఈ బడ్జెట్లో కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడనుందా?
ఈ ఏడాది వార్షిక బడ్జెట్ లో కేంద్రం నుంచి కీలక ప్రకటనలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాము. ఈ బడ్జెట్ పై సీనియర్ సీటిజన్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ప్రభుత్వం పెన్షన్, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఉపశమనం కల్పించవచ్చని చాలా నివేదికలు..

Union Budget 2026: 2026 బడ్జెట్ గురించి సీనియర్ సిటిజన్లలో అంచనాలు పెరుగుతున్నాయి. ఈసారి ప్రభుత్వం పెన్షన్, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ఉపశమనం కల్పించవచ్చని చాలా నివేదికలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు పెరిగిన మద్దతు, కొన్ని పన్ను మినహాయింపులు, వైద్య చికిత్సను సరళీకృతం చేయడానికి చర్యలు గురించి చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయాలన్నీ అంచనాలు, సూచనల పరిధిలోనే ఉన్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రతి సంవత్సరం లాగే బడ్జెట్ ముందు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన అంశాలపై చర్చ జరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వైద్య ఖర్చులు, పరిమిత ఆదాయం మధ్య వృద్ధుల అవసరాలు పెరుగుతున్నాయి. అందువల్ల బడ్జెట్ 2026 కోసం పెన్షన్లు, పన్నులు, ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.
ఇది కూడా చదవండి: Fact Check: ఈ ఏడాది మార్చిలోగా రూ.500 నోట్లు రద్దు అవుతాయా? కేంద్రం క్లారిటీ!
పెన్షన్లు ఒక కీలకమైన అంశం:
70 ఏళ్లు పైబడిన వారికి నెలవారీ పెన్షన్లను పెంచడాన్ని ప్రభుత్వం పరిగణించవచ్చని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. సాంఘిక సంక్షేమ పెన్షన్లకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో స్లాబ్ వారీగా మార్పులు ఆశిస్తున్నారు. 70–75 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు అధిక పెన్షన్లతో ప్రత్యేక స్లాబ్ను సృష్టించడం గురించి చర్చ జరుగుతోంది. కొన్ని నివేదికలు నెలకు రూ.7,500 నుండి రూ.9,000 వరకు కనీస పెన్షన్ను కూడా సూచిస్తున్నాయి. ఈ డిమాండ్ EPS-95 పెన్షనర్ల దీర్ఘకాల డిమాండ్తో సమానంగా ఉంటుంది. ఇది రూ.7,500 కరువు భత్యాన్ని జోడించాలని కోరుతుంది.
Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్లో ఎంతో తెలుసా?
అయితే ఈ సమయంలో ఈ గణాంకాలు తాత్కాలికమేనని స్పష్టంగా తెలుస్తుంది. తుది నిర్ణయం బడ్జెట్ ప్రసంగంలో వెల్లడి అవుతుంది. ఇంకా పెన్షన్ పథకాలకు అర్హతను విస్తరించడం, డాక్యుమెంటేషన్ను సరళీకృతం చేయడం, అధిక పెన్షన్ స్లాబ్లలో వితంతువులు లేదా వికలాంగులైన లబ్ధిదారులను చేర్చడానికి సిఫార్సులు చేస్తున్నారు.
సీనియర్ సిటిజన్లు ఎంత పన్ను ఉపశమనం పొందవచ్చు?
ప్రస్తుతం పాత ఆదాయపు పన్ను వ్యవస్థ ప్రకారం. 60 నుండి 79 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు రూ.3 లక్షల ప్రాథమిక మినహాయింపును పొందుతారు. 80 ఏళ్లు పైబడిన వారు రూ.5 లక్షల వరకు ప్రాథమిక మినహాయింపును పొందుతారు. అయితే ఆరోగ్య సంబంధిత ఖర్చుల కారణంగా కొన్ని తగ్గింపులు పెంచవచ్చని పన్ను నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం సీనియర్ సిటిజన్లు సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా లేదా వైద్య ఖర్చులపై రూ.50,000 వరకు, సెక్షన్ 80TTB కింద బ్యాంక్ FDలు లేదా పొదుపు పథకాలపై వడ్డీపై రూ.50,000 వరకు మినహాయింపును పొందుతారు. ఈ పరిమితులను కొద్దిగా సవరించవచ్చు లేదా అదనపు ఆరోగ్య సంబంధిత ఉపశమనం అందించబడవచ్చని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం దీనిపై ఎటువంటి ముసాయిదా లేదా అధికారిక సూచన లేదు.
ప్రభుత్వం ఇప్పటికే వృద్ధుల కోసం ఆరోగ్య పథకాలను నిర్వహిస్తోంది. 2025-26 బడ్జెట్లో వారి కోసం ప్రత్యేక నిబంధన కూడా ఉంది. నివేదికలు, వైద్యుల సూచనల ప్రకారం, బడ్జెట్ 2026 తక్కువ ప్రీమియంలు, ఎక్కువ కవరేజీతో 60 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య బీమాను బలోపేతం చేయవచ్చు. అదనంగా నివారణ ఆరోగ్య సంరక్షణపై ఎక్కువ ప్రాధాన్యత అందిస్తోంది. అధిక రక్తపోటు, మధుమేహం, చిత్తవైకల్యం వంటి వ్యాధులకు సకాలంలో స్క్రీనింగ్, మరిన్ని వృద్ధాప్య ఔట్ పేషెంట్ విభాగాలు, చిన్న నగరాలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల విస్తరణ నివేదికలు ఉన్నాయి. బడ్జెట్ 2026 సీనియర్ సిటిజన్లకు ముఖ్యంగా పెన్షన్, ఆరోగ్య సంరక్షణ రంగాలకు కొంత ఉపశమనం కలిగిస్తుందనే బలమైన ఆశ ఉంది. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగం, తరువాత వచ్చే వివరణాత్మక పత్రాల నుండి మాత్రమే నిజమైన చిత్రం స్పష్టంగా తెలుస్తుంది. అప్పటి వరకు ఈ నివేదికలను కేవలం ఊహాగానాలుగా చూడటం ఉత్తమం.
2025 Billionaires: గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల.. చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




