AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి రైతు బంధు డబ్బులు పోస్టాఫీసులో కూడా.. ఇలా చేస్తే క్షణాల్లో ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద రైతులకు రూ.5000

Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి రైతు బంధు డబ్బులు పోస్టాఫీసులో కూడా.. ఇలా చేస్తే క్షణాల్లో ..
Rythu Bandhu
Rajitha Chanti
|

Updated on: Jun 19, 2021 | 11:43 AM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద రైతులకు రూ.5000 పెట్టుబడి మద్దతను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులను విడుదలను చేసింది. దాదాపు 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ కానుంంది. అంటే… 58.85 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.2,942.27 కోట్లు జమ చేయనుంది. అయితే ఇప్పుడు రైతులకు మరో శుభవార్త అందించింది తెలంగాణ పోస్టల్ శాఖ. ఇక పై పోస్టాఫీసులో కూడా రైతు బంధు డబ్బులు తీసుకున్న సౌలభ్యాన్ని కల్పించినట్లుగా తపాలా శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఎలాంటి అదనపు రుసుం లేకుండా.. రైతు బంధు డబ్బులను తీసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.794 తపాలా కార్యాలయాల్లో మైక్రో ఏటీఎంలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లుగా శ్రీనివాస్ తెలిపారు.

అయితే ఈ రైతు బంధు డబ్బులను ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న ఏ బ్యాంక్ ఖాతా ఉన్న మైక్రో ఏటీఎంల నుంచి డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ కార్డుతోపాటు .. ఆధార్ నంబర్ రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ కూడా తీసుకెళ్లాలని శ్రీనివాస్ తెలిపారు. మైక్రో ఏటీఎంలో ఫింగర్ ప్రింట్ వేయగానే రిజిస్టర్‌ అయిన ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ మైక్రో ఏటీఎంల ద్వారా ఒక ఖాతా నుంచి రోజుకు గరిష్ఠంగా రూ.10 వేలు డ్రా చేసుకోవచ్చు. రబీ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 1.73 లక్షల మంది రైతులకు రూ.169 కోట్ల రైతు బంధు డబ్బును అందచేసినట్లుగా తెలిపారు.

Also Read: ముంబై ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంప్ కేసులో బాలీవుడ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ రమేష్ తౌరానీపైనా అనుమానపు నీలి నీడలు

Salaar Movie: ‘సలార్’ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. ప్రభాస్ సినిమాకు రూ.100 కోట్లకు పైగే..

మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?