Tax Audit Penalty: ఆ విషయంలో ఆలస్యమైతే రూ.75 వేల జరిమానా..? ఏప్రిల్ 1 నుంచి భారీ షాక్!
Tax Audit Penalty: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు 2026 ద్వారా పన్ను నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆడిట్ సంబంధిత విషయాలలో నిర్లక్ష్యం ఇప్పుడు ఖరీదైనదిగా మారవచ్చు. అందుకే ఆదాయ పన్ను చెల్లింపులుదారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు..

Tax Audit Penalty: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు 2026 ద్వారా పన్ను నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు సూచించింది. ముఖ్యంగా ఆడిట్ సంబంధిత విషయాలలో నిర్లక్ష్యం ఇప్పుడు ఖరీదైనదిగా మారనుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, ఆడిట్ నివేదికలు లేదా అకౌంటెంట్ నివేదికలను సకాలంలో సమర్పించడంలో విఫలమైతే భారీ జరిమానాలు విధించనున్నారు. ప్రభుత్వం విచక్షణా జరిమానా వ్యవస్థను స్థిర, “గ్రేడెడ్ ఫీజు” వ్యవస్థతో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నియమాలు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. 2026-27 పన్ను సంవత్సరం నుండి అమలులోకి వస్తాయి.
ఆలస్యం చేస్తే 75,000 రూపాయల జరిమానా
ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన సెక్షన్ 428, సెక్షన్ 63 ప్రకారం, ఆడిట్ సమ్మతికి ప్రాధాన్యత ఇచ్చింది. పన్ను చెల్లింపుదారులు తమ ఖాతాలను ఆడిట్ చేయడంలో లేదా ఆడిట్ నివేదికను సకాలంలో దాఖలు చేయడంలో విఫలమైతే, వారికి కనీసం 75,000 రూపాయలు జరిమానా విధించనున్నారు. ముఖ్యంగా కేవలం ఒక రోజు ఆలస్యం అయినా 75,000 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆలస్యం 30 రోజుల కంటే ఎక్కువ ఉంటే జరిమానా రూ.150,000కి పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: Multibagger: పెట్టుబడిదారుల అదృష్టాన్నే మార్చేసింది.. రూ.1 లక్ష పెట్టుబడిపై రూ.78 లక్షలు!
అకౌంటెంట్ నివేదికలలో జాప్యానికి భారీ జరిమానాలు:
అకౌంటెంట్ నివేదికలను సకాలంలో సమర్పించడంలో విఫలమైతే సెక్షన్ 172 కఠినమైన జరిమానాలను కూడా విధిస్తుంది. పన్ను చెల్లింపుదారుల అకౌంటెంట్ నివేదికను దాఖలు చేయడంలో విఫలమైతే మొదటి నెలకు రూ.50,000 రుసుము చెల్లించాలి. ఆలస్యం కొనసాగితే ఈ జరిమానా రూ.1 లక్షకు పెరుగుతుంది. ఆడిట్లు, ప్రొఫెషనల్ నివేదికలను తేలికగా తీసుకునే అలవాటును వదిలివేయాలని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది ఈ నియమం ముఖ్యంగా ఆడిట్లు తప్పనిసరి అయిన వ్యాపారాలు, నిపుణులను ప్రభావితం చేస్తుంది.
పన్ను చెల్లింపులో అలసత్వానికి అవకాశం లేదు:
అయితే, సాధారణ పన్ను చెల్లింపుదారులకు కొంత ఉపశమనం కల్పించారు. ఆదాయపు పన్ను రిటర్న్లను ఆలస్యంగా దాఖలు చేయడానికి రుసుము పరిమితం చేశారు. రూ.5 లక్షల వరకు మొత్తం ఆదాయం ఉన్నవారికి, ఈ రుసుము గరిష్టంగా రూ.1,000 ఉంటుంది. ఇతర సందర్భాల్లో గరిష్ట రుసుము రూ.5,000. ఈ కొత్త వ్యవస్థ పన్ను చెల్లింపుదారులకు నియమాలను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. మొత్తంమీద ఆర్థిక బిల్లు 2026 పన్ను సమ్మతిలో అలసత్వానికి ఆస్కారం లేదని స్పష్టం చేస్తుంది.
Vande Bharat: మీరు వందేభారత్ రైలు ఎక్కేలోపు డోర్లు క్లోజ్ అయ్యాయా? అప్పుడేం చేయాలో తెలుసా?
Airline: విమానంలో బాలున్ని ఎక్కనివ్వని ఎయిర్లైన్స్.. తర్వాత ఏం జరిగిందో తెలుసా? షాకిచ్చిన కోర్టు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




