AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sovereign Gold Bond Scheme: సోమవారం నుంచి గోల్డ్ బాండ్ అమ్మకాలు.. ఎలా కొనుగోలు చేయాలంటే..

Sovereign Gold Bond Scheme: సావరిన్ గోల్డ్ బాండ్ ఎనిమిదో విడత కొనుగోళ్లకు సంబంధించిన తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 29 సోమవారం నుంచి డిసెంబర్ 3 శుక్రవారం వరకు అంటే ఐదు రోజుల పాటు గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు...

Sovereign Gold Bond Scheme: సోమవారం నుంచి గోల్డ్ బాండ్ అమ్మకాలు.. ఎలా కొనుగోలు చేయాలంటే..
Gold
Srinivas Chekkilla
|

Updated on: Nov 28, 2021 | 10:18 AM

Share

Sovereign Gold Bond Scheme: సావరిన్ గోల్డ్ బాండ్ ఎనిమిదో విడత కొనుగోళ్లకు సంబంధించిన తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 29 సోమవారం నుంచి డిసెంబర్ 3 శుక్రవారం వరకు అంటే ఐదు రోజుల పాటు గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) స్కీమ్ 2021-22 – సిరీస్ VIII యొక్క ఇష్యూ ధరను కూడా ప్రకటించింది. బాండ్ ఇష్యూ ధర ఒక గ్రాముకు రూ.4,791గా నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో తెలిపింది. గత నెలలో కూడా ఇదే ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. సావరిన్ గోల్డ్ బాండ్లను అక్టోబర్ 2021 నుండి మార్చి 2022 వరకు నాలుగు విడతలుగా జారీ చేయనున్నట్లు ఆర్‌బీఐ గతంలో పత్రికా ప్రకటనలో తెలిపింది. 2015లో సావరిన్ గోల్డ్ బాండ్‌ స్కీమ్ ప్రవేశపెట్టారు.

999 స్వచ్ఛత ఉన్న బంగారం ముగింపు ధర సాధారణ సగటు ఆధారంగా బాండ్ ధర నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ సబ్‌స్క్రిప్షన్ పీరియడ్‌కు ముందు వారంలోని చివరి మూడు పని దినాల కోసం బాండ్ యొక్క ఇష్యూ ధరను ప్రచురిస్తుంది. ఒక్కో గ్రాము ధర రూ.4,791గా నిర్ణయించగా, ఆన్‌లైన్‌లో సబ్‌స్క్రయిబ్ చేసి డిజిటల్ మోడ్‌లో చెల్లించే వ్యక్తులు గ్రాము బంగారంపై రూ.50 తక్కువ చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. ఇది ‘డిజిటల్ ఇండియా’ అనే ప్రభుత్వ ఆలోచనకు ఊతం ఇవ్వడానికి. “భారత ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్‌తో సంప్రదించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న పెట్టుబడిదారులకు ఇష్యూ ధర నుండి గ్రాముకు రూ. 50 (రూ. యాభై మాత్రమే) తగ్గింపును అనుమతించాలని నిర్ణయించింది.

ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ చట్టం ప్రకారం భారతదేశంలో నివసించే ఎవరైనా 1999 సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, ధార్మిక సంస్థల సభ్యులు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. మైనర్ల తరఫున సంరక్షకుడు కూడా గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. ఒక వ్యక్తి డిజిటల్‌తో సహా వివిధ మార్గాల ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్‌లను కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ పద్ధతిని ఎంచుకోవడానికి, జాబితాలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల వెబ్‌సైట్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also..  Diesel Price: అంతర్జాతీయంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉన్నాయో తెలుసా..