AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: పసిడి తగ్గుతుంటే.. వెండి ధర పరుగులు పెడుతోంది.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా..!

Silver Price Today: వెండి ధర పరుగులు పెడుతోంది. ఒక వైపు బంగారం ధర తగ్గుతుంటే.. వెండి పెరుగుతోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు ధరలు పెరుగుతున్నాయి. ధరల ఎంత..

Silver Price Today: పసిడి తగ్గుతుంటే.. వెండి ధర పరుగులు పెడుతోంది.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా..!
Silver Price Today
Subhash Goud
|

Updated on: Nov 30, 2021 | 6:28 AM

Share

Silver Price Today: వెండి ధర పరుగులు పెడుతోంది. ఒక వైపు బంగారం ధర తగ్గుతుంటే.. వెండి పెరుగుతోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు ధరలు పెరుగుతున్నాయి. ధరల ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జోరుగానే సాగుతుంటాయి. అయితే బంగారం, వెండి ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. తాజాగా మంగళవారం (నవంబర్‌ 30)న దేశంలో కిలో వెండిపై రూ.500 నుంచి రూ.900 వరకు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.62,700.ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.62,700 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కోల్‌కతాలో రూ.62,700 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.62,700 ఉండగా, కేరళలో రూ.67,600 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, విజయవాడలో రూ.67,600 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు వెండి ధరలలో ఎన్నో మార్పులు ఉంటాయి. ఇలా బంగారం, వెండి ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటలకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధర.. 10 గ్రాములపై ఎంత తగ్గిందంటే..

Auto-Rickshaw: సామాన్య ప్రజలకు మరో షాక్‌ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం.. ఇక ఆటో ఎక్కితే జీఎస్టీ చెల్లించాల్సిందే..!