AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై డబ్బులు విత్‌డ్రాకు ఓటీపీ తప్పనిసరి.. జనవరి 1 నుంచి అమలు!

ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. కొత్త సంవత్సరం 2020 నుంచి ఇకపై ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే వన్ టైమ్ పాస్‌ వర్డ్(ఓటీపీ) తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్ జనవరి 1వ తేదీన అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలన్నింటికీ ఇది వర్తించనుంది. అంతేకాకుండా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల […]

ఇకపై డబ్బులు విత్‌డ్రాకు ఓటీపీ తప్పనిసరి.. జనవరి 1 నుంచి అమలు!
Ravi Kiran
| Edited By: |

Updated on: Dec 28, 2019 | 7:54 AM

Share

ఏటీఎం మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. కొత్త సంవత్సరం 2020 నుంచి ఇకపై ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే వన్ టైమ్ పాస్‌ వర్డ్(ఓటీపీ) తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఈ కొత్త రూల్ జనవరి 1వ తేదీన అమలులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలన్నింటికీ ఇది వర్తించనుంది. అంతేకాకుండా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య జరిగే విత్ డ్రాయల్స్‌కు ఇది వర్తిస్తుంది. రూ.10 వేల కంటే ఎక్కువ అమౌంట్ విత్ డ్రా చేస్తే కస్టమర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతే డబ్బులు వస్తాయి. దీని వల్ల వినియోగదారుల ఖాతాలకు మరింత సెక్యూరిటీ ఉంటుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. కాగా, ఓటీపీ ద్వారా రోజుకు ఒక్క లావాదేవీ మాత్రమే చేయవచ్చని తెలుస్తోంది.