AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rs.2000 Note Withdrawn: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

Rs.2000 Note Withdrawn: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశం
RBI
Subhash Goud
|

Updated on: May 19, 2023 | 7:34 PM

Share

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. 2 వేల నోటును బ్యాంకుల్లో ఎక్స్‌జేంజ్‌ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. అయితే సెప్టెంబర్‌ 30లోపు బ్యాంకులకలో మార్చుకోవచ్చని తెలిపింది.

ఇకపై రూ.2 వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశించింది. ఈ నోట్ల మార్పిడి మే 23 నుంచి మార్చుకునే అవకాశం ఉందని తెలిపింది. ఒక విడతలో 20 వేలు మాత్రమే మార్చుకునే అవకాశం ఉందని, 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్‌ 30 వకూ ఈ రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునే వీలుంటుందని ఆర్బీఐ తెలిపింది. దీంతో బ్యాంకులు నేటి నుంచే రూ.2 వేల నోట్లను జారీ చేయడం నిలిపివేశాయి.

వినియోగదారులకు రూ.2 వేల నోట్లు ఇవ్వకూడదని కూడా బ్యాంకలకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. 2016లో పాత నోట్లను రద్దు చేసి ఆ స్థానంలో రూ.2వేల నోటును తీసుకువచ్చింది. అయితే ఈ రూ.2 వేల నోట్లను మార్చుకుకోవడానికి ఎలాంటి రుసుము ఉండదు. ఒక వేల ఏదైనా బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకునేందుకు నిరాకరిస్తే అంబుడ్స్‌మెన్‌కి ఫిర్యాదు చేయవచ్చని ఆర్బీఐ తెలిపింది. క్లీన్‌ నోట్‌ పాలసీలో భాగంగా రూ.2000 నోట్లను ఉపసంహరణ, 2018-19లోనే రూ.2వేల నోట్ల ముద్రణను నిలిపివేశామని ఆర్బీఐ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి