AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rs 500 Notes: చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.500 నోట్లే ఎక్కువ.. నకిలీ నోటుపై RBI తాజా రిపోర్టు..

చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 2022- 23లో 7.8 శాతం పెరిగిందని మంగళవారం వెలువడిన ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడించింది. నోట్ల సంఖ్య 4.4 శాతం పెరిగినట్లు తెలిపింది. చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువలో రూ.500, రూ.2,000 నోట్ల విలువే 87.9 శాతమని తెలిపింది.

Rs 500 Notes: చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.500 నోట్లే ఎక్కువ.. నకిలీ నోటుపై  RBI తాజా రిపోర్టు..
Rs 500 Notes
Sanjay Kasula
|

Updated on: May 31, 2023 | 2:27 PM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం, బ్యాంకింగ్ వ్యవస్థలో పట్టుబడిన రూ. 500 నకిలీ నోట్ల సంఖ్య 2022-23లో మునుపటి సంవత్సరంతో పోలిస్తే 14.6 శాతం పెరిగి 91,110 నోట్లకు చేరుకుంది. మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, సిస్టమ్ ద్వారా గుర్తించబడిన రూ. 2,000 డినామినేషన్‌లోని నకిలీ నోట్ల సంఖ్య అదే సమయంలో 28 శాతం తగ్గి 9,806 నోట్లకు చేరుకుంది. అయితే, బ్యాంకింగ్ రంగంలో గుర్తించిన మొత్తం నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో 2,30,971 నోట్లతో పోలిస్తే 2022-23లో 2,25,769 నోట్లకు తగ్గింది.

ఇది 2021-22లో పెరగడం గమనార్హం. రూ.20 డినామినేషన్‌లో గుర్తించిన నకిలీ నోట్లలో 8.4 శాతం పెరుగుదల, రూ. 500 (కొత్త డిజైన్) డినామినేషన్‌లో 14.4 శాతం పెరుగుదలను ఆర్‌బిఐ వార్షిక నివేదిక కూడా హైలైట్ చేసింది. మరోవైపు రూ.10, రూ.100, రూ.2000 నకిలీ నోట్లు వరుసగా 11.6 శాతం, 14.7 శాతం, 27.9 శాతం తగ్గాయి.

కరెన్సీకి సంబంధించి ఆర్‌బీఐ ఇచ్చిన సమాచారం

2022-23లో విలువ, పరిమాణం పరంగా నోట్ల చెలామణి వరుసగా 7.8 శాతం, 4.4 శాతం పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, ఈ సంఖ్య వరుసగా 9.9 శాతం, ఐదు శాతం. నివేదిక ప్రకారం, మార్చి 31, 2023 నాటికి, విలువ పరంగా చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో రూ.500, రూ.2,000 బ్యాంకు నోట్ల వాటా 87.9 శాతం. ఏడాది క్రితం ఈ సంఖ్య 87.1 శాతంగా ఉంది.

రూ. 2000 నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. వాటిని డిపాజిట్ చేయడానికి లేదా మార్చడానికి సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. ఈ నివేదికలో, “వాల్యూమ్ పరంగా, మార్చి 31, 2023 వరకు చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ. 500 నోట్ల వాటా 37.9 శాతం, ఇది అత్యధికం, తరువాత రూ. 10 నోట్లు, దీని వాటా 19.2 శాతం. ” మార్చి 2023 చివరి నాటికి, రూ. 500 మొత్తం 5,16,338 లక్షల నోట్లు చెలామణిలో ఉన్నాయి, దీని మొత్తం విలువ రూ. 25,81,690 కోట్లు.

రూ. 2000 నోట్ల చలామణి తగ్గింది

మార్చి నెలాఖరు నాటికి 4,55,468 లక్షల రెండు వేల రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయని, వీటి మొత్తం విలువ రూ.3,62,220 కోట్లు అని కూడా నివేదిక పేర్కొంది. రెండు వేల రూపాయల నోట్ల చెలామణిలో విలువ, పరిమాణం రెండింటిలోనూ తగ్గుదల చోటుచేసుకుందని తెలిపింది. ప్రస్తుతం రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇది కాకుండా, 50 పైసలు, ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, 10 రూపాయలు,  20 రూపాయల నాణేలు కూడా చెలామణిలో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం

Follow Us