Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PIDF Scheme: పీఐడీఎఫ్‌ పథకం గడువు మరో రెండేళ్లు పొడిగించిన ఆర్బీఐ

పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (పీఐడీఎఫ్) పథకాన్ని రెండేళ్లపాటు ఆర్బీఐ పొడిగించింది. ఈ పథకం 31 డిసెంబర్ 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దాని లబ్ధిదారుల కవరేజీని పెంచడానికి పిఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులను పిఐడిఎఫ్ పథకం కింద వ్యాపారులుగా చేర్చారని అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది..

PIDF Scheme: పీఐడీఎఫ్‌ పథకం గడువు మరో రెండేళ్లు పొడిగించిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను పాటించని సహకార బ్యాంకులపై చర్య తీసుకోవడం ద్వారా పెట్టుబడిదారుల డబ్బును రక్షించడానికి ప్రయత్నిస్తుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను నాలుగు సహకార బ్యాంకులకు జరిమానాలు విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది. ఈ 4 బ్యాంకుల్లో 3 గుజరాత్‌కు చెందినవే కావడం గమనార్హం.
Follow us
Subhash Goud

|

Updated on: Dec 30, 2023 | 11:24 AM

మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (PIDF) పథకాన్ని రెండేళ్లపాటు డిసెంబర్ 2025 వరకు పొడిగించింది. దీనితో పాటు, ‘సౌండ్ బాక్స్’ పరికరాలు, ‘ఆధార్’తో అనుసంధానించబడిన బయోమెట్రిక్ పరికరాలను చేర్చడం ద్వారా సబ్సిడీ ఇచ్చే పరిధిని విస్తరించింది. నవంబర్ 30, 2023 నాటికి పీఐడీఎఫ్‌ కార్పస్ రూ. 1,026.37 కోట్లుగా ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పీఐడీఎఫ్‌ పథకాన్ని జనవరి 2021లో మూడేళ్లపాటు ప్రారంభించింది. టైర్-3 నగరాల నుండి టైర్-6 నగరాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లకు చెల్లింపుల మౌలిక సదుపాయాలను పెంచడం ఈ పథకం లక్ష్యం.

పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (పీఐడీఎఫ్) పథకాన్ని రెండేళ్లపాటు ఆర్బీఐ పొడిగించింది. ఈ పథకం 31 డిసెంబర్ 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దాని లబ్ధిదారుల కవరేజీని పెంచడానికి పిఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులను పిఐడిఎఫ్ పథకం కింద వ్యాపారులుగా చేర్చారని అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 2021లో మూడేళ్ల కాలానికి PIDFని ప్రారంభించింది. దిగువ శ్రేణి నగరాలు, పట్టణాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, లడఖ్ రాష్ట్రాల్లో పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినల్, QR కోడ్ మొదలైన చెల్లింపు అంగీకార సౌకర్యాలను స్వీకరించడాన్ని ప్రోత్సహించడం పీఐడీఎఫ్‌ పథకం లక్ష్యం. ఈ పథకంలో ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన మొత్తం ప్రస్తుతం వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ.

ఇవి కూడా చదవండి

మరొక గమనించదగ్గ అంశం ఏమిటంటే, సౌండ్ బాక్స్ పరికరాల కోసం ప్రభుత్వం పీఐడీఎఫ్‌ పథకం కింద సబ్సిడీని అందించింది. చెల్లింపు అంగీకార సదుపాయాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు లేదా పాపులర్ చేయడానికి బయోమెట్రిక్ పరికరాలను ఆధార్ ఎనేబుల్ చేసింది. ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లలో ఈ సౌండ్ బ్యాంక్‌లు, బయోమెట్రిక్ పరికరాల మొత్తం ధర రూ. 90% సబ్సిడీ లభిస్తుంది.

నవంబర్ 30, 2023 వరకు ఉన్న సమాచారం ప్రకారం పీఐడీఎఫ్‌ పథకం కింద ఇన్‌స్టాల్ చేయబడిన సబ్సిడీ భౌతిక చెల్లింపు పరికరాల సంఖ్య 8,27,901. 2,71,95,902 డిజిటల్ పరికరాలు ఉన్నాయి. భౌతిక పరికరాలలో POS టెర్మినల్స్, మొబైల్ POS, GPRS (జనరల్ ప్యాకెట్ రేడియో సర్వీస్), PSTNలు ఉన్నాయి. UPI QR, Bharat QR కోడ్ మొదలైనవి. QR కోడ్ మొదలైనవి డిజిటల్ పరికరాల జాబితాలో చేర్చబడ్డాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి