AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం.. బ్యాంకులకు సర్య్కూలర్‌ జారీ!

RBI: ప్రజలకు తరచుగా ఉపయోగించే డినామినేషన్ నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి, అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (WLAOలు) వారి ATMలు కూడా క్రమం తప్పకుండా రూ.100, రూ.200 నోట్లు అందించే విధంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

RBI: రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం.. బ్యాంకులకు సర్య్కూలర్‌ జారీ!
Subhash Goud
|

Updated on: Apr 29, 2025 | 10:43 AM

Share

దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూ.100, రూ.200 నోట్లకు సంబంధించి ఒక పెద్ద ఆర్డర్ జారీ చేసింది. రెండు నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ జారీ చేసిన సూచనలను వీలైనంత త్వరగా అమలు చేయాలని బ్యాంకులను కోరింది. దీనికోసం ఆర్‌బిఐ అన్ని బ్యాంకులకు ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. 100, 200 రూపాయల నోట్లకు సంబంధించి RBI ఎలాంటి సర్క్యులర్ జారీ చేసిందో తెలుసుకుందాం.

బ్యాంకులకు ఆర్‌బిఐ ఆదేశాలు

ఏటీఎంలు కూడా రూ.100, రూ.200 నోట్లను పంపిణీ చేసేలా చూసుకోవాలని సోమవారం బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. ప్రజలకు ఈ నోట్ల లభ్యతను పెంచడానికి అలా చేయడం అవసరమని కేంద్ర బ్యాంకు తెలిపింది. బ్యాంకులు, వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు (WLAOలు) ఈ ఆదేశాలను దశలవారీగా అమలు చేయాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ కాని సంస్థలు నిర్వహించే ATMలను ‘వైట్ లేబుల్ ATMలు’ (WLA) అంటారు. ఇప్పుడు అన్ని బ్యాంకులు రూ.100, .200 నోట్ల విషయంలో ATMలలో మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.

ప్రజలకు తరచుగా ఉపయోగించే డినామినేషన్ నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి, అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (WLAOలు) వారి ATMలు కూడా క్రమం తప్పకుండా రూ.100, రూ.200 నోట్లు అందించే విధంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఆ సర్క్యులర్ ప్రకారం, సెప్టెంబర్ 30, 2025 నాటికి, 75 శాతం ఏటీఎంలు (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లు) కనీసం ఒక క్యాసెట్‌ను రూ.100 లేదా రూ. 200 డినామినేషన్ బ్యాంక్ నోట్లను అందించాలని తెలిపింది.

దీని తరువాత మార్చి 31, 2026 నాటికి, 90 శాతం ఏటీఎంలు కనీసం ఒక క్యాసెట్ నుండి రూ. 100 లేదా రూ. 200 డినామినేషన్ గల బ్యాంక్ నోట్లను అందించాలని తెలిపింది. ప్రజల్లో ఈ నోట్లను ఎక్కువ మొత్తంలో వాడకం ఉండేలా చూడాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆయా బ్యాంకులను కోరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
నీటి స్నానం, పాల స్నానం కాదు.. ఒత్తిడిని తుడిచిపెట్టే అడవి స్నానం
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
బంగారం ధరలు ఢమాల్‌.. మహిళలకు పండగే.. పండగ.. 11 వేలకుపైగా తగ్గింది
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. బయట హీరోయిన్ రేంజ్‏లో ఉందిగా..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
ఈ డాక్టర్ల వ్యవహారం తెలిస్తే మీరూ నవ్విపోతారు..
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
18 బంతుల్లోనే 80 పరుగులు.. ఎన్ని బంతుల్లో సెంచరీ చేశాడంటే?
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. వాళ్లపై ఉన్న కేసులన్నీ మాఫీ..!
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
18 ఏళ్లుగా నిండు గర్భం మోస్తున్న మహిళ ? దాని లోపల పెరుగుతున్నది
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?
సింపుల్‌గా నిమిషాల్లోనే.. టేస్టీగా సాంబార్ చేయడం ఎలా..?
ఇదేం సినిమా అన్నారు.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఇదేం సినిమా అన్నారు.. అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
వృద్ధ తండ్రిపై కొడుకుల పైశాచికత్వం.. నడిరోడ్డుపైనే..!
వృద్ధ తండ్రిపై కొడుకుల పైశాచికత్వం.. నడిరోడ్డుపైనే..!