Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravindra Jadeja: క్రికెటర్‌ జడేజాకు ఈ పోస్టాఫీసు స్కీమ్‌ నచ్చిందట.. ఇందులో ఎంత పెట్టుబడి పెట్టాడంటే..

భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా పుట్టినరోజు. రవీంద్ర జడేజా జీవితం, జీవనశైలి గురించి పబ్లిక్ డొమైన్‌లో చాలా కనిపిస్తాయి. అయితే గుజరాత్ అసెంబ్లీ..

Ravindra Jadeja: క్రికెటర్‌ జడేజాకు ఈ పోస్టాఫీసు స్కీమ్‌ నచ్చిందట.. ఇందులో ఎంత పెట్టుబడి పెట్టాడంటే..
రవీంద్ర జడేజా (2012): 2012లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రవీంద్ర జడేజాను రూ.12.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఏడాది ఆ జట్టు ఫైనల్స్‌లో ఓడిపోయింది.
Follow us
Subhash Goud

|

Updated on: Dec 06, 2022 | 5:18 PM

భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా పుట్టినరోజు. రవీంద్ర జడేజా జీవితం, జీవనశైలి గురించి పబ్లిక్ డొమైన్‌లో చాలా కనిపిస్తాయి. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఆయన భార్య రివాబా రవీంద్రసిన్హ్ సోలంకి ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్ సమర్పించినప్పుడు అతని సంపద, పెట్టుబడులు, ఆదాయ వనరులు మొదటిసారిగా వెలుగులోకి వచ్చాయి. జడేజా దంపతుల ఆస్తుల విలువ రూ.97,35,59,222. రవీంద్ర జడేజా వద్ద ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇందులో ఆడి కార్లు వంటివి ఉన్నాయి. కానీ అతను స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడు లేదా అతని వద్ద మ్యూచువల్ ఫండ్ ఏమీ లేదు. అలాగే అతను ఎల్‌ఐసీలోని ఏ స్కీమ్‌లోనూ పెట్టుబడి పెట్టలేదు. అయితే అతని భార్య అఫిడవిట్ నుండి ఒక షాకింగ్ విషయం వెల్లడైంది. రవీంద్ర జడేజా పోస్టాఫీసులోని పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టారని అఫిడవిట్‌లో వెల్లడైంది.

జడేజా భార్య సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. రవీంద్ర పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టాడు. ఈ పథకం అనేది ఒక సంవత్సరంలో అత్యధిక రాబడిని ఇచ్చే సాధారణ కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. రవీంద్ర జడేజా పీపీఎఫ్‌ పథకంలో రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ వివరాలు తెలుసుకుని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆయనకు కోట్లాది రూపాయల రియల్ ఎస్టేట్ ఆస్తి ఉంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ లేదా బాండ్లలో ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా ఈ పీపీఎఫ్‌ స్కీమ్‌ను ఎంచుకున్నాడని ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

పీపీఎఫ్‌ ప్రత్యేకత ఏమిటి?

  • భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చే పీఎఫ్‌ పథకం పూర్తిగా సురక్షితమైనది.
  • ఈ పోస్టాఫీసు పథకంలో ఏటా 7.10 శాతం రాబడి లభిస్తుంది.
  • పీపీఎఫ్‌ లాక్-ఇన్ వ్యవధి 15 సంవత్సరాలు.15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఖాతాదారుడు ఈ వ్యవధిని పొడిగించాలనుకుంటే దానిని 5 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.
  • పెట్టుబడి పెట్టిన మొత్తం, సంపాదించిన వడ్డీ, మొత్తం మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితం. ఈ స్కీమ్‌లో పన్నును ఆదా చేసుకోవచ్చు. మీరు పీపీఎఫ్‌ ఖాతాలో సంవత్సరానికి కనీసం రూ.500 నుండి గరిష్టంగా రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పీపీఎఫ్‌ ఖాతా కోసం మీకు ఒకేసారి మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే మీ ఖాతాను కొనసాగించడానికి మీరు ప్రతి సంవత్సరం డిపాజిట్ చేయాలి.
  • పీపీఎఫ్‌ ఖాతాలో 3 సంవత్సరాలు పొదుపు చేసిన తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై లోన్ తీసుకోవచ్చు. పీపీఎఫ్‌ ఖాతాను ఒక వ్యక్తి పేరుతో లేదా మైనర్ విషయంలో సంరక్షకుని తరపున తెరవవచ్చు.
  • ఖాతాదారు మరణించిన సందర్భంలో మొత్తం నామినీకి చెల్లించబడుతుంది. పీపీఎఫ్‌ ఖాతా తెరవడానికి భారతీయ పౌరులకు మాత్రమే అనుమతి ఉంది. ఎన్‌ఆర్‌ఐ లేదా హెచ్‌యూఎఫ్‌లకు అర్హత ఉండదు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి