AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Gupta: మహిళలకు ఆదర్శం ఆమె.. ఉద్యోగం రాకపోయినా రూ.లక్ష పెట్టుబడితో 800 కోట్ల టర్నోవర్‌ కంపెనీ..!

ఉద్యోగమే పరమావధిగా చదివేవాళ్లు చాలా మంది ఉంటారు. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా కష్టపడి పని చేస్తే విజయం లభిస్తుంది. అయితే ఓ మహిళ ఉద్యోగం రాలేదని బాధపడకుండా కేవలం రూ.లక్షతో పేపర్ రీసైక్లింగ్ వ్యాపారాన్ని ప్రారంభించి, ఇప్పుడు తన కంపెనీ విలువ రూ.800 కోట్లకు చేరిన ఎన్నారై వ్యాపారవేత్త విజయగాథ గురించి మనం ఓ సారి తెలుసుకుందాం.

Poonam Gupta: మహిళలకు ఆదర్శం ఆమె.. ఉద్యోగం రాకపోయినా రూ.లక్ష పెట్టుబడితో 800 కోట్ల టర్నోవర్‌ కంపెనీ..!
Poonam Gupta
Nikhil
| Edited By: |

Updated on: Nov 05, 2023 | 9:53 PM

Share

భారతదేశంలో వేతన జీవుల సంఖ్య ఎక్కువ. ఈ నేపథ్యంలో చాలా మంది ఏదైనా ఉద్యోగానికి ఎంపికవ్వకపోతే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. ఉద్యోగమే పరమావధిగా చదివేవాళ్లు చాలా మంది ఉంటారు. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా కష్టపడి పని చేస్తే విజయం లభిస్తుంది. అయితే ఓ మహిళ ఉద్యోగం రాలేదని బాధపడకుండా కేవలం రూ.లక్షతో పేపర్ రీసైక్లింగ్ వ్యాపారాన్ని ప్రారంభించి, ఇప్పుడు తన కంపెనీ విలువ రూ.800 కోట్లకు చేరిన ఎన్నారై వ్యాపారవేత్త విజయగాథ గురించి మనం ఓ సారి తెలుసుకుందాం.

ప్రముఖ వ్యాపారవేత్త పూనమ్ గుప్తా ఢిల్లీలో జన్మించింది. ఢిల్లీలో లేడీ ఇర్విన్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో తన ప్రారంభ విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. ఆమె ఢిల్లీలోని ఎఫ్‌ఓఆర్‌ఈ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, హాలండ్‌లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ పట్టా కూడా పొందారు. పూనమ్‌ గుప్తా 2002లో పునీత్ గుప్తాను వివాహం చేసుకుంది. ఆ తర్వాత స్కాట్లాండ్‌కు వెళ్లింది, అక్కడ ఆమె ఉద్యోగం పొందలేకపోయింది. దీంతో ఆమె వ్యాపారాల వైపు అడుగులు వేసింది.

పూనమ్ 2003లో స్కాట్లాండ్‌లోని కిల్మాకోమ్‌లోని తన కుటుంబ ఇంటి నుంచి స్కాటిష్ ప్రభుత్వ పథకం నుండి రూ. 1 లక్ష నిధులను స్వీకరించిన తర్వాత తన మొదటి వ్యాపారమైన పీజీ పేపర్ కంపెనీ లిమిటెడ్‌ని ప్రారంభించింది. పీజీ పేపర్ ప్రపంచంలోని 53 దేశాల నుండి వస్తువులను దిగుమతి, ఎగుమతులను చేస్తుంది. అలాగే యునైటెడ్ కింగ్‌డమ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పేపర్ కంపెనీలలో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ ప్రస్తుతం ఏడాదికి 800 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

పూనమ్ గుప్తా తన కంపెనీని 2003 సంవత్సరంలో ప్రారంభించింది. నేటికి దాదాపు 19 సంవత్సరాలు. చాలా నెలల పరిశోధన తర్వాత, స్క్రాప్ పేపర్‌ను రీసైక్లింగ్ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లింది. ముఖ్యంగా యూరప్, అమెరికాలోని కంపెనీల నుంచి చిత్తు కాగితాలను కొనుగోలు చేసేది. ఇప్పుడు ఇది ప్రపంచంలోని అనేక దేశాల నుంచి స్క్రాప్ తీసుకుంటుంది. మంచి నాణ్యమైన కాగితాన్ని కూడా తయారు చేసి ఇతర దేశాలకు పంపుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్..
90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్..
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..?
ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..?
27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?
27 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ హీరోయిన్ హఠాన్మరణం.. కారణమేమిటంటే?
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!