PM Kian: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్ 19వ విడత విడుదల చేసిన ప్రధాని మోదీ!
PM Kisan: కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. రైతులకు కూడా ఎన్నో పథకాలు ఉన్నాయి. అందులో పీఎం కిసాన్ పథకం ఒకటి. ఈ స్కీమ్లో రైతులు ఏడాదికి రూ.6000ను అందుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో..

ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రైతులకు రానే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నిధులను మంజూరు చేశారు. ఈ పథకం కింద 19వ విడత పీఎం కిసాన్ నిధులను మోడీ బీహార్లోని భాగల్పుర్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన రూ.22వేల కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ పథకం కింద రైతులు ఏడాదికి రూ.6000 చొప్పున అందుకుంటున్నారు. ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు సామాన వాయిదాలలో రూ.2000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తోంది కేంద్రం. ఈ పీఎం కిసాన్ 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఇప్పటివరకు 11 కోట్లమంది రైతులకు 18 వాయిదాల్లో రూ.3.46లక్షల కోట్లు అందజేసింది.
ఇది కూడా చదవండి: Gold Price: వామ్మో.. సామాన్యులకు కష్టమే..11,000 పెరిగిన బంగారం ధర.. లక్ష దాటనుందా..?
డబ్బులు వచ్చాయా? లేదా తెలుసుకోవడం ఎలా?
➦ ముందుగా pmkisan.gov.in కి వెళ్లండి.
➦ ఫార్మర్స్ కార్నర్ పేజీకి వెళ్లి బెనిఫిషియరీ స్టేటస్పై క్లిక్ చేయండి.
➦ ఆధార్ కార్డ్ నంబర్ లేదా ఖాతా నంబర్ను నమోదు చేయండి.
➦ చెల్లింపు చరిత్రపై క్లిక్ చేయడం ద్వారా, వినియోగదారులు స్థితిని తెలుసుకోవచ్చు.
పీఎం కిసాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
కొత్త రైతులు పీఎం కిసాన్ కోసం ఆన్లైన్లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ల (CSCs) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా నమోదు చేసుకోవాలో చూద్దాం..
➦ ముందుగా అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ను సందర్శించండి.
➦ ‘కొత్త రైతు నమోదు’ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.
➦ అక్కడ ఆధార్ నంబర్, రాష్ట్రం, జిల్లా, వ్యక్తిగత/బ్యాంక్ సమాచారం వంటి అవసరమైన వివరాలను నమోదు చేయండి.
➦ ఫారమ్ను సమర్పించి ఒక కాపీని సేవ్ చేసుకోండి.
➦ దరఖాస్తును సమర్పించిన తర్వాత ఆమోదం పొందే ముందు స్థానిక అధికారులు దానిని ధృవీకరిస్తారు.
ఇది కూడా చదవండి: Azim Premji: భారత్లోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త.. ప్రతిరోజూ రూ. 27 కోట్లు విరాళం.. ఇతనెవరో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి