AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ డబ్బు రెట్టింపు అవుతుందా? పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన ఒక ప్రధాన ప్రశ్న రైతులలో విస్తృతంగా చర్చ కొనసాగుతోంది. ఈ పథకం వార్షిక మొత్తాన్ని రూ.6,000 నుండి రూ.12,000 కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందా? డిసెంబర్ 2024లో పార్లమెంటరీ స్టాండింగ్..

PM Kisan: పీఎం కిసాన్ డబ్బు రెట్టింపు అవుతుందా? పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
Subhash Goud
|

Updated on: Dec 13, 2025 | 11:02 AM

Share

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన ఒక ప్రధాన ప్రశ్న రైతులలో విస్తృతంగా చర్చ కొనసాగుతోంది. ఈ పథకం వార్షిక మొత్తాన్ని రూ.6,000 నుండి రూ.12,000 కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందా? డిసెంబర్ 2024లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులకు ఏటా రూ.12,000 ఇవ్వాలని సిఫార్సు చేసింది. డిసెంబర్ 12, 2025 న, రాజ్యసభ ఎంపీ సమిరుల్ ఇస్లాం ఈ అంశంపై ప్రభుత్వం నుండి ప్రతిస్పందనను కోరారు.

ఈ ప్రశ్నపై వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ ప్రభుత్వం అటువంటి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. దీని అర్థం ప్రస్తుతం ప్రధానమంత్రి కిసాన్ మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రణాళికలు లేవు. ఇది రైతుల మధ్య చర్చలకు ముగింపు పలికింది.

ఇది కూడా చదవండి: Gold Price Updates: ఇదేందిరా సామి బంగారం ధర ఇంత తగ్గిందా..? వెండిపై భారీ తగ్గింపు!

ఇవి కూడా చదవండి

రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి కాదా?

ఎంపీ సమీరుల్ ఇస్లాం మరో ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ప్రధానమంత్రి కిసాన్ వాయిదాలను స్వీకరించడానికి కిసాన్ ఐడి నమోదు తప్పనిసరి కాదా? దీనికి ప్రతిస్పందనగా సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ మాట్లాడుతూ, కొత్త రిజిస్ట్రేషన్లకు మాత్రమే కిసాన్ ఐడి అవసరమని, అది కూడా రైతు రిజిస్ట్రీని సిద్ధం చేసే పని ఇప్పటికే 14 రాష్ట్రాల్లో ప్రారంభమైందని అన్నారు. ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాని రాష్ట్రాల్లో కిసాన్ ఐడి లేకుండా కూడా రైతులు ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి నమోదు చేసుకోవచ్చు. కిసాన్ ఐడి కోసం ఇంకా నమోదు చేసుకోని రాష్ట్రాల రైతుల డేటాను కూడా మంత్రి అందించారు.

ఇది కూడా చదవండి: Pension Plan: ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం ప్రతి నెల రూ.12 వేల పెన్షన్‌!

ఈ స్కీమ్‌ను కేంద్రం ఫిబ్రవరి 2019లో ప్రారంభించింది. సాగు భూమి ఉన్న రైతులకు వార్షికంగా రూ.6,000 ఆర్థిక సహాయం అందించడం దీని లక్ష్యం. ఈ మొత్తాన్ని DBT ద్వారా నేరుగా రైతుల ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాలకు రూ.2,000 చొప్పున మూడు విడతలుగా బదిలీ చేస్తారు. అయితే, ఈ పథకం భూమి యజమానులైన రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. కొన్ని ఆర్థికంగా సమర్థులైన వర్గాలకు మినహాయింపు ఉంది.

ఇప్పటివరకు 21 విడతలు విడుదల:

ప్రభుత్వం డేటా ప్రకారంజజ ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి 21 విడతలుగా రూ.4.09 లక్షల కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేసింది కేంద్రం. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకాలలో ఒకటిగా నిలిచింది.

లబ్ధిదారుల జాబితాను ఎలా తనిఖీ చేయాలి?

రైతులు అధికారిక PM కిసాన్ వెబ్‌సైట్, pmkisan.gov.in ని సందర్శించడం ద్వారా లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను సులభంగా తనిఖీ చేయవచ్చు. వెబ్‌సైట్‌లోని రైతు కార్నర్ విభాగంలో లబ్ధిదారుల జాబితా ఎంపికను ఎంచుకుని, రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామాన్ని నమోదు చేయడం ద్వారా పూర్తి జాబితా తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: Aadhaar Services: గుడ్‌న్యూస్‌.. ఇంటి వద్దే ఆధార్‌ సేవలు పొందడం ఎలా? ఇలా దరఖాస్తు చేసుకోండి!

ఇది కూడా చదవండి: Ozempic: డయాబెటిస్‌ వారికి శుభవార్త.. నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది.. ఉపయోగమేంటో తెలుసా?