AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rupay Debit Card: బడ్జెట్‌కు ముందే మోదీ సర్కార్ భారీ కానుక.. రుపే కార్డ్‌పై క్యాష్‌ బ్యాక్ ఆఫర్..

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2600 కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది.

Rupay Debit Card: బడ్జెట్‌కు ముందే మోదీ సర్కార్ భారీ కానుక.. రుపే కార్డ్‌పై క్యాష్‌ బ్యాక్ ఆఫర్..
PM Modi
Sanjay Kasula
|

Updated on: Jan 11, 2023 | 7:42 PM

Share

దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రూ.2600 కోట్ల పథకానికి ఆమోదం తెలిపింది. దీని ద్వారా భీమ్ UPI, రూపే డెబిట్ కార్డ్‌ల ద్వారా చేసే తక్కువ ధర లావాదేవీలపై వినియోగదారులకు ఆర్థిక ప్రోత్సాహకం అందించనుంది. ఈ ప్రోత్సాహకాన్ని బ్యాంకు ద్వారా అందజేస్తుంది. మీరు దీనిని క్యాష్‌బ్యాక్‌గా భావించవచ్చు. ఈ పథకం కింద, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘పాయింట్ ఆఫ్ సేల్’ (PoS) చెల్లింపు యంత్రాలు, రూపే, UPI ఉపయోగించి ఇ-కామర్స్ లావాదేవీలను ప్రోత్సహించడానికి బ్యాంకులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నాయి.

ఇది పటిష్టమైన డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుంది. తక్కువ ధర, ఉపయోగించడానికి సులభమైన UPI లైట్, UPI 123 పే కూడా పథకం కింద ప్రచారం చేయబడుతుంది.

ఇందుకు కేబినెట్ నిర్ణయాలు ఇలా ఉన్నాయి. రూపే కార్డు ద్వారా డిజిటల్ చెల్లింపుపై 0.4 శాతం ప్రోత్సాహకం ఇవ్వబడుతుందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. అదే సమయంలో, భీమ్ UPI ద్వారా రూ. 2000 కంటే తక్కువ లావాదేవీలపై 0.25 శాతం ప్రోత్సాహకం అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, మీరు బీమా, మ్యూచువల్ ఫండ్స్, జ్యువెలరీ, పెట్రోలియం ఉత్పత్తులు, సేవలను భీమ్ UPI నుంచి కొనుగోలు చేస్తే.. మీకు 0.15 శాతం ప్రోత్సాహకం లభిస్తుంది.

యూపీఐ చెల్లింపులకు..

డిసెంబర్‌లో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీలు రూ. 12 లక్షల కోట్లకు చేరుకున్నాయని భూపేంద్ర యాదవ్ చెప్పారు. ఈ నెలలో యూపీఐ ద్వారా 730 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. ఇది దేశ జీడీపీలో దాదాపు 54 శాతానికి చేరువైంది. నవంబర్‌లో మొత్తం లావాదేవీ విలువ రూ.11.9 లక్షల కోట్లు. 2022 సంవత్సరంలో UPI ద్వారా 7404 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇందులో రూ. 125 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. దీన్ని మరింత పెంచేందుకు రూ. 2600 కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించామని తెలిపారు. ముందుగా 2021లో కూడా ఈ భీమ్ UPI  రూపే క్రెడిట్ కార్డ్‌లను ప్రమోట్ చేయడానికి ప్రోత్సాహకాలు ప్రకటించబడ్డాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం