నగదు లావాదేవీలు సాంప్రదాయకంగా భారత ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నల్లధనం పేరుకుపోవడానికి నిరంతర కారణంగా మారుతోంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నగదు లావాదేవీలపై ఎప్పటికప్పుడు పలు పరిమితులను విధించింది. ఈ పరిమితులకు మించి నగదును చెల్లించడం, స్వీకరించడం లేదా దాచుకోవడం వలన చెల్లించిన, స్వీకరించిన మొత్తంలో 100 శాతం వరకు జరిమానా విధించబడుతుంది. అయితే మీకు కూడా ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు దాచుకునే అలవాటు ఉంటే వెంటనే ఈ విషయం తెలుసుకోండి. ఎందుకంటే మీపై ఐటీ అధికారుల కన్ను పడే అవకాశం ఉంది. దీంతో మీరు పెద్ద మొత్తంలో ఆర్ధిక నష్టాన్ని చూడాల్సి వస్తుంది. చాలా మంది వ్యాపారస్తులు తమ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు నిల్వ ఉంచుకుంటారు. తమకు అవసరమైనప్పుడు ఆ నగదును ఉపయోగించుకునేలా ప్లాన్ చేసుకుంటారు.
అయితే, ఇంట్లో నగదు పరిమితికి సంబంధించి దాచుకోవడం సరికాదని ఆదాయపు పన్ను శాఖ అంటోంది. ఇందు కోసం ఐటీ శాఖ కొన్ని నిబంధనలని జారీ చేసింది. ఇంట్లో ఎంత మొత్తంలో దాచుకోవచ్చనే మనలో చాలా మందికి తెలియదు. నా డబ్బు నా ఇష్టం అనేలా దాచుకుంటారు. వీటి గురించి తెలియక చాలామంది ఇబ్బందిపడుతున్నారు. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం.
స్వయం ఉపాధి పన్ను చెల్లింపుదారుల విషయానికి వస్తే.. ఒకే రోజులో ఒకే వ్యక్తికి నగదు రూపంలో చెల్లించినట్లయితే వారు రూ. 10వేల కంటే ఎక్కువ ఖర్చును క్లెయిమ్ చేయలేరు. ట్రాన్స్పోర్టర్కి ఇచ్చిన చెల్లింపుల కోసం చట్టం రూ. 35 వేల అధిక థ్రెషోల్డ్ని ఏర్పాటు చేస్తుంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం