Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Restaurant Service Charge: సర్వీస్ ఛార్జీ వసూలు చేయకూడదు.. రెస్టారెంట్‌ యజమానులకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు!

Restaurant Service Charge: కోర్టు మార్గదర్శకాలను సవాలు చేసినందుకు ఢిల్లీ హైకోర్టు రెస్టారెంట్ అసోసియేషన్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది. జూలై 4, 2022న సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) జారీ చేసిన మార్గదర్శకాలను అదే నెల చివరిలో హైకోర్టు నిలిపివేసింది.

Restaurant Service Charge: సర్వీస్ ఛార్జీ వసూలు చేయకూడదు.. రెస్టారెంట్‌ యజమానులకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు!
Follow us
Subhash Goud

|

Updated on: Mar 28, 2025 | 7:14 PM

ఈ రోజుల్లో చాలా మంది రకరకాల ఫుడ్‌ను తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. రెస్టారెంట్లు, ఇతర హోటళ్లలో తినేందుకు ఇష్టపడుతుంటారు. కానీ రెస్టారెంట్ యజమానులు బిల్లులో GSTతో పాటు సర్వీస్ ఛార్జీని జోడించినప్పుడు వారి ఆనందం చెడిపోతుంది. కస్టమర్ అనుమతి లేకుండా రెస్టారెంట్ బిల్లులో సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తుంటారు. కానీ తెలియక చాలా మంది ఈ బిల్లును రెస్టారెంట్ యజమానికి GST, సర్వీస్ ఛార్జీతో పాటు చెల్లిస్తారు. ఇక ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండబోదు.

FHRAI పిటిషన్ దాఖలు:

ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన ఆహార బిల్లులో జీఎస్టీ తరహాలో సర్వీస్ ఛార్జీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించే కారణంగా రెస్టారెంట్లు ఆహార బిల్లులో సర్వీస్ ఛార్జీని తప్పనిసరి చేయరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. రెస్టారెంట్ యజమానులు బిల్లుపై సర్వీస్ ఛార్జీ విధించవద్దని కోరుతూ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) మార్గదర్శకాల చెల్లుబాటును ఢిల్లీ హైకోర్టు తన నిర్ణయంలో సమర్థించింది.

ఇవి కూడా చదవండి

రెస్టారెంట్ అసోసియేషన్‌కు హైకోర్టు జరిమానా:

కోర్టు మార్గదర్శకాలను సవాలు చేసినందుకు ఢిల్లీ హైకోర్టు రెస్టారెంట్ అసోసియేషన్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది. జూలై 4, 2022న సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) జారీ చేసిన మార్గదర్శకాలను అదే నెల చివరిలో హైకోర్టు నిలిపివేసింది.

సర్వీస్ ఛార్జ్ డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి:

ఒక రెస్టారెంట్ యజమాని మీ నుండి లేదా మీ పరిచయస్తుల నుండి బలవంతంగా సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తే, మీరు దాని గురించి వినియోగదారుల కోర్టు, ఆహార వినియోగదారుల అథారిటీలో ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ ఫిర్యాదు నమోదైతే ఆ రెస్టారెంట్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి