Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday: రంజాన్‌ రోజు బ్యాంకులకు సెలవు ఉందా? లేదా? ఆర్బీఐ ప్రకటన ఏంటి?

Bank Holiday: బీమా సంస్థలు కూడా మార్చి 31న తెరిచే ఉంటాయి. పాలసీదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడానికి మార్చి 29, 30, 31 తేదీల్లో తమ కార్యాలయాలను తెరిచి ఉంచాలని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) బీమా కంపెనీలను ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయడానికి..

Bank Holiday: రంజాన్‌ రోజు బ్యాంకులకు సెలవు ఉందా? లేదా? ఆర్బీఐ ప్రకటన ఏంటి?
Follow us
Subhash Goud

|

Updated on: Mar 28, 2025 | 2:23 PM

మార్చి 31న దేశంలో ఈద్-ఉల్-ఫితర్ పండుగ జరుపుకుంటారు. అటువంటి పరిస్థితిలో దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉంటాయి. కానీ, ఆర్‌బిఐ బ్యాంకు ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. మార్చి 31 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి రోజు. అందుకే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకు ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజున ఆర్థిక లావాదేవీల ప్రక్రియను సరిగ్గా నిర్వహించడానికి ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది.

ఇది ఆర్థిక సంవత్సరం చివరి రోజు. ఆర్థిక లావాదేవీలను పూర్తి చేయడానికి బ్యాంకులను తెరవాలని ఆర్‌బిఐ నిర్ణయించింది. ముందుగా బ్యాంకులు మిజోరాం, హిమాచల్ ప్రదేశ్‌లలో మాత్రమే తెరవాలని భావించిన ఆర్బీఐ.. తరువాత దేశవ్యాప్తంగా బ్యాంకులను తెరవాలని నిర్ణయించింది.

అన్ని పనులు జరగవు:

మార్చి 31న ఈద్ నాడు బ్యాంకులు తెరిచి ఉంటాయి. కానీ ఆ రోజు బ్యాంకుల్లో అన్ని రకాల పనులు జరగవు. కొన్ని స్థిర లావాదేవీలు జరుగుతాయి. ఉదాహరణకు, మార్చి 31న, ఆదాయపు పన్ను, కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకం, జీఎస్టీకి సంబంధించిన చెల్లింపులు చేసుకోవచ్చు. పెన్షన్, ప్రభుత్వ భత్యాల పంపిణీకి సంబంధించిన చెల్లింపులు మాత్రమే సాధ్యమవుతాయి.

డిజిటల్ చెల్లింపులు కొనసాగుతాయి: ఈద్ రోజున బ్యాంకులు మూసివేయబడతాయి. బ్యాంకులకు వెళ్లడం ద్వారా కొన్ని పనులు మాత్రమే జరుగుతాయి. కానీ, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆన్‌లైన్ నిధుల బదిలీ, ప్రభుత్వ పన్ను చెల్లింపు సేవలు కొనసాగుతాయి. ఈ పనుల కోసం మీరు బ్రాంచ్ కి వెళ్ళవలసిన అవసరం లేదు.

ఏప్రిల్ 1న కూడా బ్యాంకులు క్లోజ్‌:

మార్చి 31 ఆర్థిక సంవత్సరం చివరి రోజు. బ్యాంకులు ముగింపు రోజు కాబట్టి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1న, దేశంలోని కొన్ని రాష్ట్రాలు తప్ప, ప్రతిచోటా బ్యాంకులు తెరిచి ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్, మిజోరం, పశ్చిమ బెంగాల్, మేఘాలయలలో బ్యాంకులు తెరిచి ఉంటాయి. మిగిలిన ప్రదేశాలు మూసి ఉంటాయి.

అలాగే బీమా సంస్థలు కూడా మార్చి 31న తెరిచే ఉంటాయి. పాలసీదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడానికి మార్చి 29, 30, 31 తేదీల్లో తమ కార్యాలయాలను తెరిచి ఉంచాలని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) బీమా కంపెనీలను ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయడానికి వీలుగా భారతదేశం అంతటా అన్ని ఆదాయపు పన్ను కార్యాలయాలు మార్చి 29, 30, 31 తేదీలలో తెరిచి ఉంటాయని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి