DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. 2 శాతం డీఏ పెంచుతూ కేంద్ర సర్కార్ నిర్ణయం!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీలో కేంద్ర ఉద్యోగులకు శుభవార్త అందించింది. కరవు భత్యం 2 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. మార్చి నెలలో ప్రభుత్వం కరువు భత్యం పెంపును ప్రకటించింది. దీంతో 53% నుండి 55%కి పెంచూ నిర్ణయం తీసుకుంది.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు…ఇటు రైతులు..రెండు వర్గాల పైన కేంద్రం వరాల జల్లు కురిపించింది. కేబినెట్ భేటీలో కేంద్ర ఉద్యోగులకు శుభవార్త అందించింది. కరవు భత్యం 2 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. మార్చి నెలలో ప్రభుత్వం కరువు భత్యం పెంపును ప్రకటించింది. దీంతో 53% నుండి 55%కి పెంచూ నిర్ణయం తీసుకుంది. అయితే, గత 78 నెలల్లో కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యంలో ఇది అత్యధిక పెరుగుదల అవుతుంది. కాగా ఉద్యోగులకు డీఏను రెండు నెలల బకాయిలను కలిపి మార్చి నెల జీతంతో పాటు ఇస్తారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు, వారి మూల వేతనం ఆధారంగా కరవు భత్యం చెల్లిస్తారు. అయితే పెన్షనర్లకు కరవు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లపై ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించడమే కేంద్ర సర్కార్ లక్ష్యం. ద్రవ్యోల్బణ రేటు ఆధారంగా ప్రభుత్వం దీనిని సంవత్సరానికి రెండుసార్లు మారుస్తుంది.
కొత్త కరవు భత్యం రేట్లు జనవరి నుండి జూన్ అర్ధ సంవత్సరానికి, తరువాత జూలై నుండి డిసెంబర్ అర్ధ సంవత్సరానికి వర్తిస్తాయి. ప్రభుత్వం ప్రకటించిన కరువు భత్యం ప్రయోజనం ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థలలో అంటే ప్రభుత్వ సంస్థలలో పనిచేసే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లభించదు.
ఈసారి ప్రభుత్వం డీఏను 2% పెంచింది. ఈ పెంపు తర్వాత, ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం 53% నుండి 55%కి పెరిగింది. జూలై-డిసెంబర్ 2024 సంవత్సరానికి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) డేటా ఆధారంగా ఈ పెరుగుదల జరిగింది. ఒక ఉద్యోగి మూల జీతం రూ. 18 వేలు అయితే, 2 శాతం పెరిగిన తర్వాత, అతనికి ప్రతి నెలా రూ. 360 అదనంగా లభిస్తుంది. ఈ విధంగా, ఒక సంవత్సరంలో రూ. 4,320 అదనపు ఆదాయం ఉంటుంది. మరోవైపు, ఒక పెన్షనర్ ప్రాథమిక పెన్షన్ రూ. 9,000 అయితే, 2 శాతం పెరుగుదలతో, అతను ప్రతి నెలా రూ. 180 అదనంగా పొందుతారు. అంటే అతనికి ఒక సంవత్సరంలో పెన్షన్లో రూ.2,160 ప్రయోజనం లభిస్తుంది.
రెండు శాతం డీఏ పెంపు ద్వారా 48.56 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు లాభం చేకూరనుంది. తాజా కేబినెట్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై రూ.6వేల 614 కోట్ల భారం పడనుండగా.. పెరిగిన డీఏ జనవరి 2025 నుంచి అమల్లోకి రానుంది. చివరగా గతేడాది జులైలో డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచారు. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
డీఏ అంటే ఏమిటి?
ప్రభుత్వ ఉద్యోగులకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రకారం వారి మూల వేతనాన్ని సర్దుబాటు చేసుకోవడానికి ఇచ్చే మొత్తాన్ని డియర్నెస్ అలవెన్స్ అంటారు. ప్రతి 10 సంవత్సరాల తర్వాత వేతన సంఘంలో ప్రాథమిక వేతనం నిర్ణయించడం జరుగుతుంది. అయితే డీఏ ఉద్యోగుల జీతంలో కాలానుగుణ పెరుగుదలను నిర్ధారిస్తుంది.
ఇక రైతులపై భారం తగ్గించేందుకు పోషక ఆధారిత ఎరువులపై కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. అయితే, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పోషక ఆధారిత పీఅండ్కే ఎరువులకు రూ. 37,216 కోట్ల సబ్సిడీ మంజూరు చేసింది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ పథకం కింద 28 రకాల పోషక ఆధారిత ఎరువుల గరిష్ట చిల్లర ధరను తయారీదారులు లేదా దిగుమతిదారులు తగిన స్థాయిలో నిర్ణయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొవిడ్ వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో డీఏపీ ధరలు బాగా పెరిగాయి. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, ధరల అస్థిరతను తగ్గించేందుకు డీఏపీ గరిష్ట చిల్లర ధర 50 కిలోల బ్యాగ్కు రూ.1,350కు కేంద్రం పరిమితం చేసింది.
నాన్ – సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం.. PLI కిందకు తీసుకొచ్చారు. దీనికోసం ఆరేళ్లకు గాను రూ.22,919 కోట్లు వెచ్చించనున్నారు. దీనివల్ల సుమారు రూ.59,350 కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతో పాటు ప్రత్యక్షంగా 91 వేల మందికి, పరోక్షంగా మరికొన్ని వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అటు ఉద్యోగులు…ఇటు రైతులు..రెండు వర్గాల పైన కేంద్రం వరాల జల్లు కురిపించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..