AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recharge Prices: భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?

మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఏకంగా 15 శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5జీ విస్తరణ కోసం టెలికాం కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. దీంతో ఈ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు సిద్దమవుతున్నాయి. అతి త్వరలోనే ధరలు భారీగా పెరగనున్నాయి.

Recharge Prices: భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
Mobie Recharge
Venkatrao Lella
|

Updated on: Jul 06, 2026 | 3:08 PM

Share

మొబైల్ వినియోగదారులకు భారీ షాక్. రీఛార్జ్ ధరలు భారీగా పెరగనున్నాయి. మరోసారి ధరలను పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్దమవుతున్నాయి. ఈసారి దాదాపు 12 నుంచి 15 శాతం వరకు పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనర్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. రానున్న 3 నుంచి 4 నెలల్లో పెంపు ఉండనున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నాయి. దీంతో ఈ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసేందుకు టెలికాం నెట్‌వర్క్ కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే అవకాశముందని తెలుస్తోంది.

త్వరలోనే పెరగనున్న రీఛార్జ్ ధరలు

మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశముందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. గత కొద్ది నెలలుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఎట్టకేలకు పెంపునకు రంగం సిద్దమైంది. ఈ సారి భారీగా పెంచే అవకాశముండటంతో.. వినియోగదారులు రీఛార్జ్ కోసం భారీగా చెల్లించక తప్పదు. దీంతో మొబైల్ వాడేవారికి ఖర్చు పెరగనుంది. 4జీ,5జీ వినియోగం పెరగడంతో డేటా వినియోగం కూడా భారీగా పెరిగింది. దీంతో కంపెనీలకు కూడా నెట్‌వర్క్ విస్తరణ కోసం ఖర్చు పెరుగుతోంది. అలాగే పోస్ట్ పోయిడ్ యూజర్లు కూడా పెరుగుతున్నారు. దీని వల్ల కంపెనీలకు ఆదాయం కూడా పెరుగుతోంది. జూన్ త్రైమాసికంలో టెలికాం కంపెనీల సగటు ఆదాయం 1 నుంచి 1.5 శాతానికి పెరిగింది.

పెరుగుతున్న కంపెనీల ఆదాయం

వినియోగదారులు 2జీ నుంచి 4జీ, 5జీ నెట్‌వర్క్‌కు మారుతున్నారు. దీంతో మొబైల్ టెలికాం కంపెనీలకు ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. దేశంలో దాదాపు 90 శాతానికిపైగా జిల్లాల్లో జియో, ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్‌ను అందిస్తున్నాయి. ఇక వొడాఫోన్ ఐడియా దాదాపు 100 సిటీల్లో 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించింది. ఎయిర్‌టెల్, జియో కంపెనీలు దేశంలో టాప్ టెలికాం కంపెనీలుగా ఉన్నాయి. ప్రతీ నెలా కొత్త సబ్‌స్కైబర్లను ఆకర్షించడంలో ముందు వరుసలో ఉన్నాయి. త్రైమాసికం ప్రకారం చూస్తే జియో 70 లక్షల మంది కస్టమర్లను చేర్చుకుంటుండగా.. ఎయిర్‌టెల్ 50 లక్షల మంది చేరుతున్నారు. ఇక వొడాఫోన్ ఐడియాలో 2 లక్షల మంది చేరుతున్నారు.

Follow Us
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర