AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio True 5G: తెలంగాణలో మరో 8 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవ‌లు ప్రారంభం.. యూజర్లకు వెల్కం ఆఫర్‌

5జీ నెట్‌ వర్క్‌లో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది..

Jio True 5G: తెలంగాణలో మరో 8 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవ‌లు ప్రారంభం.. యూజర్లకు వెల్కం ఆఫర్‌
Jio True 5G
Subhash Goud
|

Updated on: Mar 08, 2023 | 3:38 PM

Share

5జీ నెట్‌ వర్క్‌లో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని చాలా నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి రాగా, తాజాగా తెలంగాణలోని మరికొన్ని నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తెలంగాణ లోని మరో 8 నగరాల్లో మంగళవారం లాంఛనంగా ప్రారంభించింది. కొత్తగా జియో 5జీ సేవలు.. సిద్ధిపేట, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, కోదాడ, తాండూర్, జహీరాబాద్, నిర్మల్ నగరాల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 10 నగరాలైన హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాల లో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కొత్తగా ప్రారంభించిన 8 నగరాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 నగరాల్లో జియో వినియోగదారులు 5జీ సేవ‌ల‌ను పొందవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణలోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.

జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో తెలంగాణ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి, ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. జియో ట్రూ 5 జి పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్ట‌చివ‌రి అడుగు వ‌ర‌కు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ కే సీ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో జియో ట్రూ 5జీని మరో 8 నగరాలకు విస్తరించడం పట్ల సంతోషంగా ఉంది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ -5 జి ప్రయోజనాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారు. అందువ‌ల్ల ఈ గ‌ణ‌నీయ‌మైన మార్పుకు ఉన్న శ‌క్తి, దాని అపార ప్ర‌యోజ‌నాల‌ను మ‌న దేశంలోని ప్ర‌తి పౌరుడు అనుభవించగలడు. తెలంగాణను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు.

మార్చి 8 నుంచి వెల్కం ఆఫర్‌:

మార్చి 8 నుంచి ఈ 8 నగరాల్లో జియో వినియోగదారులకు జియో వెల్కం ఆఫర్ ఆహ్వానం అందుతుంది. దీనిద్వారా వారు అదనపు ఖర్చు లేకుండా 1 జిబిపిఎస్ + వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చని జియో తెలిపింది. జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ 4జీ ఎల్ టిఇ టెక్నాలజీతో ప్రపంచస్థాయి ఆల్-ఐపీ డేటా స్ట్రాంగ్ ఫ్యూచర్ ప్రూఫ్ నెట్ వర్క్ ను నిర్మించింది. వారసత్వ మౌలిక సదుపాయాలు, దేశీయ 5జి స్టాక్ లేకుండానే ఇప్పుడు 5 జి నెట్ వర్క్ సిద్ధంగా ఉంది. క్షేత్ర‌స్థాయి నుంచే మొబైల్ వీడియో నెట్ వర్క్ గా భావిస్తున్న‌ ఏకైక నెట్ వర్క్ ఇది. ఇది భవిష్యత్తు అవ‌స‌రాల‌ను తీర్చేందుకు సిద్ధంగా ఉంది. సాంకేతికతలు 6 జి, అంతకు మించి ముందుకు సాగుతున్నందున మరింత డేటాకు మద్దతు ఇవ్వడానికి సులభంగా అప్ గ్రేడ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ గురించి మాట్లాడితే.. 1.3 బిలియన్ల (130 కోట్ల‌) మంది భారతీయులకు డిజిటల్ ఇండియా దార్శనికతను ప్రారంభించడానికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థానం దిశ‌గా నడిపించడానికి జియో భారతీయ డిజిటల్ సేవల రంగంలో అపార‌మైన‌ మార్పులను తీసుకొచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ జియో డిజిటల్ జీవితాన్ని గడపడానికి నెట్ వర్క్, పరికరాలు, అప్ల‌కేష‌న్లు, కంటెంట్, సేవా అనుభవం, సరసమైన టారిఫ్ లతో కూడిన వ్యవస్థను సృష్టించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి