Stock Market: వారాంతంలో పాజిటివ్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీలను ముందుకు నడిపించిన IT షేర్లు..

Stock Market: ఉదయం లాభాల్లో ప్రారంభమైన బెంచ్‌మార్క్‌లు నిఫ్టీ- 50, సెన్సెక్స్ ఒక శాతానికి పైగా లాభపడడంతో భారతీయ మార్కెట్ వారం చివరి ట్రేడింగ్ రోజును పాజిటివ్ నోట్‌తో ముగిశాయి.

Stock Market: వారాంతంలో పాజిటివ్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సూచీలను ముందుకు నడిపించిన IT షేర్లు..
Stock Market
Follow us

|

Updated on: May 27, 2022 | 4:35 PM

Stock Market: ఉదయం లాభాల్లో ప్రారంభమైన బెంచ్‌మార్క్‌లు నిఫ్టీ- 50, సెన్సెక్స్ ఒక శాతానికి పైగా లాభపడడంతో భారతీయ మార్కెట్ వారం చివరి ట్రేడింగ్ రోజును పాజిటివ్ నోట్‌తో ముగిశాయి. రెండో రోజు ర్యాలీని కొనసాగిస్తూ నిఫ్టీ సూచీ 16,300 పాయింట్లపైన ముగిసింది. ఇదే సమయంలో మరో కీలక సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభపడి 54,900 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు ర్యాలీకి ఎక్కువగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లు దోహదపడ్డాయి. నిఫ్టీ ఐటీ దాదాపు 2.5% లాభపడగా, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ ఈ రోజు దాదాపు 1.7 శాతం పెరిగింది. నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ ఒక శాతం క్షీణించింది. నిఫ్టీ మెటల్ ఫ్లాట్‌గా ముగియటంతో మెటల్ ఇండెక్స్ కూడా కొంత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది.

గ్లోబల్ ర్యాలీలో చేరడం, USలో అనుకూలమైన రిటైల్ ఆదాయాలను అనుసరించి ఇన్వెస్టర్లు కొనుగోళ్లు మార్కెట్లను ముందుకు నడిపాయి. ఎఫ్‌ఐఐల అమ్మకాలు తగ్గుముఖం పట్టడం కూడా దేశీయ మార్కెట్‌కు ఓదార్పునిచ్చిందని బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. RBI రానున్న పాలసీ సమావేశం మార్కెట్లో కీలకమైన అంశంగా మారనుంది. ఈ సారి రేట్ల పెంపు దాదాపు 25 నుంచి 35 బేసిస్ పాయింట్ల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ కీలక సంకేతాలు ఇచ్చారు. రానున్న రోజుల్లో మరింత రేట్ల పెంపు ఉంటుందని చెప్పకనే చెప్పారు.

ఇదే సమయంలో నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ దాదాపు 1.3% చొప్పున పెరిగాయి. దీనికి ఇండియా విక్స్ సూచీ తగ్గుముఖం పట్టడం కూడా కారణంగా తెలుస్తోంది. స్టాక్‌లలో.. అపోలో హాస్పిటల్స్ దాదాపు ఐదు శాతం లాభంతో నిఫ్టీని నడిపించాయి. సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా నాలుగు శాతంతో అత్యధికంగా లాభంతో క్లోజ్ అయింది. దీనికి తోడు ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, విప్రో ఇన్ఫోసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎల్ అండ్ టీ, కోటక్ బ్యాంక్ లాభపడ్డ షేర్లలో ఉన్నాయి. పాజిటివ్ మార్కెట్‌లో క్షీణించిన షేర్లలో గ్యాస్ అండ్ మెటల్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. వారం చివరి రోజున ఒఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, పోవ్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఆర్‌ఐఎల్ ప్రముఖంగా నష్టాలతో ముగిశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు