AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రైల్వే కీలక నిర్ణయం.. ఆ టికెట్‌ ఛార్జీలు తగ్గింపు

ఇండియన్‌ రైల్వే ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఇక ప్రయాణికుల కోసం భారత రైల్వే ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది..

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రైల్వే కీలక నిర్ణయం.. ఆ టికెట్‌ ఛార్జీలు తగ్గింపు
Indian Railways
Subhash Goud
|

Updated on: Mar 22, 2023 | 3:23 PM

Share

ఇండియన్‌ రైల్వే ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఇక ప్రయాణికుల కోసం భారత రైల్వే ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. రైల్వేలు ఏసీ-3 ఎకానమీ క్లాస్ ఛార్జీలను తగ్గించాయి. ఇప్పుడు రైలులోని ఏసీ త్రీ ఎకానమీ కోచ్‌లో ప్రయాణించడం మళ్లీ చౌకగా మారింది. రైల్వే బోర్డు జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం.. పాత వ్యవస్థనే పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. రైల్వే అధికారులు తెలిపిన ప్రకారం, ఆన్‌లైన్‌లో కౌంటర్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ముందస్తుగా బుక్ చేసిన టిక్కెట్‌ల కోసం అదనపు డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది.

కొత్త ఆర్డర్ ప్రకారం.. ఈ ఎకానమీ క్లాస్ సీటు ధర సాధారణ ఏసీ-3 నుండి తగ్గించబడింది. అయితే, గతేడాది రైల్వే బోర్డు ఏసీ 3 ఎకానమీ కోచ్‌, ఏసీ 3 కోచ్‌ల ఛార్జీలను సమానంగా ఉంచుతూ సర్క్యులర్‌ జారీ చేసింది. కొత్త సర్క్యులర్ ప్రకారం.. ఛార్జీల తగ్గింపుతో ఎకానమీ కోచ్‌లో దుప్పట్లు, బెడ్‌షీట్లను అందించే విధానం కొనసాగుతుంది.

ఎకానమీ ఏసీ-3 కోచ్ చౌకైన ఎయిర్ కండీషనర్ రైలు ప్రయాణ సేవ. స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు ‘ఉత్తమమైన, చౌకైన ఏసీ ప్రయాణం’ అందించడానికి ఎకానమీ ఏసీ-3 కోచ్‌ను ప్రవేశపెట్టారు. ఈ కోచ్‌ల ధర సాధారణ ఏసీ-3 సర్వీస్‌ కంటే 6-7 శాతం తక్కువ.

ఇవి కూడా చదవండి

ఏసీ త్రీ కోచ్‌లలో బెర్త్‌ల సంఖ్య 72 కాగా, ఏసీ త్రీ ఎకానమీ బెర్త్‌ల సంఖ్య 80గా ఉంది. ఏసీ-3 ఎకానమీ కోచ్ బెర్త్ వెడల్పు ఏసీ 3 కోచ్ కంటే కొంచెం తక్కువగా ఉన్నందున ఇది సాధ్యమవుతుంది. ‘ఎకానమీ’ ఏసీ-3 కోచ్‌ ద్వారా తొలి ఏడాదిలోనే రైల్వేశాఖ రూ.231 కోట్లు ఆర్జించింది. గణాంకాల ప్రకారం.. ఏప్రిల్-ఆగస్టు, 2022లో మాత్రమే 15 లక్షల మంది ఈ ఎకానమీ కోచ్‌లో ప్రయాణించి రూ. 177 కోట్లు ఆర్జించారు.

రైల్వే ఆదాయాలపై ఎలాంటి ప్రభావం లేదు:

ఈ కోచ్‌ల పరిచయం సాధారణ ఏసీ-3 తరగతి నుంచి వచ్చే ఆదాయాలపై ప్రభావం చూపలేదని దీని నుంచి కూడా స్పష్టమైంది. అందుకే రైల్వే ఇప్పుడు ఏసీ త్రీ ఎకానమీ ఛార్జీలను తగ్గించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ