AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyperloop Train: 4 గంటల ప్రయాణం కేవలం 25 నిమిషాల్లోనే.. త్వరలో హైపర్‌లూప్ రైలు

Hyperloop Train: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం Xలో ఒక వీడియోను షేర్ చేస్తూ, హైపర్‌లూప్ ప్రయాణ మార్గాల్లో ఆధునిక మార్పులను ప్రోత్సహించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని అన్నారు. ఐఐటీ మద్రాస్‌కు రెండుసార్లు ఒక్కొక్కరికి..

Hyperloop Train: 4 గంటల ప్రయాణం కేవలం 25 నిమిషాల్లోనే.. త్వరలో హైపర్‌లూప్ రైలు
Subhash Goud
|

Updated on: May 13, 2025 | 12:31 PM

Share

భారతదేశంలో మొట్టమొదటి హైపర్‌లూప్ ప్రాజెక్ట్ ముంబై – పూణే మధ్య ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ దూరం 3-4 గంటల్లో చేరుకుంటుంది. అయితే హైపర్‌లూప్ ద్వారా ఈ ప్రయాణం కేవలం 25 నిమిషాల్లో పూర్తవుతుంది. నివేదిక ప్రకారం, 24 నుండి 28 మంది ప్రయాణికులు ఒక పాడ్‌లో కూర్చోవచ్చు. హార్డ్ట్ హైపర్‌లూప్ మొదటి విజయవంతమైన పరీక్ష 2019లో జరిగింది.

హైపర్‌లూప్ అనేది ఒక హై-స్పీడ్ రైలు. ఇది ఒక ట్యూబ్‌లోని వాక్యూమ్‌లో నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు వెయ్యి కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో పాడ్‌లు వాక్యూమ్ ట్యూబ్ లోపల అయస్కాంత సాంకేతికతతో నడుస్తాయి. ఈ వ్యవస్థలో శక్తి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇది దాదాపు జీరో పోల్యూషన్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం Xలో ఒక వీడియోను షేర్ చేస్తూ, హైపర్‌లూప్ ప్రయాణ మార్గాల్లో ఆధునిక మార్పులను ప్రోత్సహించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని అన్నారు. ఐఐటీ మద్రాస్‌కు రెండుసార్లు ఒక్కొక్కరికి ఒక మిలియన్ డాలర్ల గ్రాంట్ ఇచ్చామని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి మూడవసారి ఒక మిలియన్ డాలర్ల గ్రాంట్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ హైపర్‌లూప్ ప్రారంభంతో 300 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 30 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు అని అన్నారు. స్పానిష్ కంపెనీ గెల్రాస్ హైపర్‌లూప్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. యూరోపియన్ నగరాలను గంటకు 1000 కి.మీ వేగంతో అనుసంధానించడం దీని లక్ష్యం.

బెంగళూరు-చెన్నై మధ్య హైపర్‌లూప్ రైలును నడపడానికి రైల్వేలు ఒక ప్రణాళికపై పని చేస్తున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ, ఐఐటీ మద్రాస్ ఈ సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నాయి. ఈ దూరాన్ని కేవలం 30 నుండి 40 నిమిషాల్లోనే అధిగమించవచ్చు. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ హైపర్‌లూప్ ఆధారిత మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేస్తోంది. 2025 నాటికి గంటకు 1000 కి.మీ. వేగంతో చేరుకునేలా ప్లాన్‌ చేస్తున్నారు అధికారులు.

ఇది కూడా చదవండి: Schools Reopen: కీలక నిర్ణయం.. విద్యార్థులు మళ్లీ బడిబాట.. తెరుచుకోనున్న విద్యాసంస్థలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్