AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyperloop Train: 4 గంటల ప్రయాణం కేవలం 25 నిమిషాల్లోనే.. త్వరలో హైపర్‌లూప్ రైలు

Hyperloop Train: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం Xలో ఒక వీడియోను షేర్ చేస్తూ, హైపర్‌లూప్ ప్రయాణ మార్గాల్లో ఆధునిక మార్పులను ప్రోత్సహించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని అన్నారు. ఐఐటీ మద్రాస్‌కు రెండుసార్లు ఒక్కొక్కరికి..

Hyperloop Train: 4 గంటల ప్రయాణం కేవలం 25 నిమిషాల్లోనే.. త్వరలో హైపర్‌లూప్ రైలు
Subhash Goud
|

Updated on: May 13, 2025 | 12:31 PM

Share

భారతదేశంలో మొట్టమొదటి హైపర్‌లూప్ ప్రాజెక్ట్ ముంబై – పూణే మధ్య ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ దూరం 3-4 గంటల్లో చేరుకుంటుంది. అయితే హైపర్‌లూప్ ద్వారా ఈ ప్రయాణం కేవలం 25 నిమిషాల్లో పూర్తవుతుంది. నివేదిక ప్రకారం, 24 నుండి 28 మంది ప్రయాణికులు ఒక పాడ్‌లో కూర్చోవచ్చు. హార్డ్ట్ హైపర్‌లూప్ మొదటి విజయవంతమైన పరీక్ష 2019లో జరిగింది.

హైపర్‌లూప్ అనేది ఒక హై-స్పీడ్ రైలు. ఇది ఒక ట్యూబ్‌లోని వాక్యూమ్‌లో నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు వెయ్యి కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో పాడ్‌లు వాక్యూమ్ ట్యూబ్ లోపల అయస్కాంత సాంకేతికతతో నడుస్తాయి. ఈ వ్యవస్థలో శక్తి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇది దాదాపు జీరో పోల్యూషన్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం Xలో ఒక వీడియోను షేర్ చేస్తూ, హైపర్‌లూప్ ప్రయాణ మార్గాల్లో ఆధునిక మార్పులను ప్రోత్సహించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని అన్నారు. ఐఐటీ మద్రాస్‌కు రెండుసార్లు ఒక్కొక్కరికి ఒక మిలియన్ డాలర్ల గ్రాంట్ ఇచ్చామని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి మూడవసారి ఒక మిలియన్ డాలర్ల గ్రాంట్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ హైపర్‌లూప్ ప్రారంభంతో 300 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 30 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు అని అన్నారు. స్పానిష్ కంపెనీ గెల్రాస్ హైపర్‌లూప్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. యూరోపియన్ నగరాలను గంటకు 1000 కి.మీ వేగంతో అనుసంధానించడం దీని లక్ష్యం.

బెంగళూరు-చెన్నై మధ్య హైపర్‌లూప్ రైలును నడపడానికి రైల్వేలు ఒక ప్రణాళికపై పని చేస్తున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ, ఐఐటీ మద్రాస్ ఈ సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నాయి. ఈ దూరాన్ని కేవలం 30 నుండి 40 నిమిషాల్లోనే అధిగమించవచ్చు. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ హైపర్‌లూప్ ఆధారిత మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేస్తోంది. 2025 నాటికి గంటకు 1000 కి.మీ. వేగంతో చేరుకునేలా ప్లాన్‌ చేస్తున్నారు అధికారులు.

ఇది కూడా చదవండి: Schools Reopen: కీలక నిర్ణయం.. విద్యార్థులు మళ్లీ బడిబాట.. తెరుచుకోనున్న విద్యాసంస్థలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు