AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గురువారం ప్రభుత్వానికి రూ. 2,424 కోట్లు డివిడెండ్ చెల్లించింది. పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం (DIPAM) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు....

Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..
Ioc
Srinivas Chekkilla
|

Updated on: Nov 25, 2021 | 10:06 PM

Share

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గురువారం ప్రభుత్వానికి రూ. 2,424 కోట్లు డివిడెండ్ చెల్లించింది. పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం (DIPAM) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు, ప్రభుత్వం అనేక ప్రభుత్వ యాజమాన్య సంస్థల నుండి డివిడెండ్ పరంగా రూ. 20,222 కోట్లు పొందింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశంలో అతిపెద్ద చమురు సంస్థగా ఉంది. దేశం యొక్క పెట్రోలియం ఉత్పత్తులలో దాదాపు 50 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇది 2020-21లో 81.027 మిలియన్ మెట్రిక్ టన్నుల అమ్మకాలను నమోదు చేసింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) గత నెలలో ప్రభుత్వానికి రూ. 6,665 కోట్ల తుది డివిడెండ్‌ను చెల్లించింది.

దీంతో గురువారం NSEలో ఇండియన్ ఆయిల్ షేర్లు 1.14% తగ్గి ₹126.15 వద్ద స్థిరపడ్డాయి. ఎనర్జీ మేజర్ గ్రూప్ రిఫైనింగ్ కెపాసిటీ 80.55 MMTPA, 15,000 కి.మీ కంటే ఎక్కువ దూరం గల పైప్‌లైన్ నెట్‌వర్క్‌ని కలిగి ఉంది.

Read Also.. Soap: సామాన్యులకు షాక్.. పెరిగిన సబ్బులు, సర్ఫ్‎ల ధరలు..