AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI ప్రపంచ వృద్ధిని పెంచుతుంది.. వికసిత్‌ భారత్‌ కూడా సాధ్యమే: IMF ఎండీ

IMF MD క్రిస్టాలినా జార్జివా ప్రకారం, AI ప్రపంచ వృద్ధిని 0.8 శాతం పెంచి, భారత్ 'విక్షిత్ భారత్' లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదపడుతుంది. భారత్ 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, AI 40 శాతం ప్రపంచ ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందని అన్నారు.

AI ప్రపంచ వృద్ధిని పెంచుతుంది.. వికసిత్‌ భారత్‌ కూడా సాధ్యమే: IMF ఎండీ
Imf Md
SN Pasha
|

Updated on: Feb 20, 2026 | 11:40 PM

Share

ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రపంచ వృద్ధిని 0.8 శాతం పెంచుతుందని, భారత్‌ విక్షిత్ భారత్ లేదా అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యం సాధించదగినదని IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా బుధవారం అన్నారు. ఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో జరిగిన ప్యానెల్ చర్చలో జార్జివా మాట్లాడుతూ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చేసిన పరిశోధన AI ప్రపంచ వృద్ధిని గణనీయంగా వేగవంతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని సూచిస్తుందని అన్నారు. “మేం కొంత పరిశోధన చేశాం. మనకు తెలిసిన దాని ఆధారంగా AI ప్రపంచ వృద్ధిని దాదాపు ఒక శాతం పాయింట్ పెంచగలదు. మేం 0.8 శాతం అంటున్నాం.. అంటే ప్రపంచం COVID మహమ్మారికి ముందు కంటే వేగంగా అభివృద్ధి చెందుతుంది” అని ఆమె అన్నారు.

మరిన్ని అవకాశాలు, మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి వేగవంతమైన ఆర్థిక వృద్ధి అద్భుతం అని ఆమె తెలిపారు. భారత్‌ కోసం మనం చూస్తున్న పరిమాణం ఇదే, దీని అర్థం భారత్‌ విక్సిత్ భారత్ సాధించదగినది అని జార్జివా అన్నారు. భారత్‌ 2047 నాటికి విక్షిత్ భారత్‌గా మారాలని, 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని ఆకాంక్షిస్తోంది. అదే సమయంలో AI ఉద్యోగ మార్కెట్‌కు గణనీయమైన నష్టాలను కలిగిస్తుందని IMF MD హెచ్చరించారు.

ఈ ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని మేం లెక్కించాం. వాస్తవానికి AI ప్రభావాన్ని మనం సునామీలా చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు AI వల్ల ప్రభావితమవుతాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో 40 శాతం, కానీ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో 60 శాతం అని ఆమె చెప్పారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us