PM Kisan: భార్యభర్తలిద్దరికి పీఎం కిసాన్ ప్రయోజనాలుంటాయా ? అర్హులెవరో తెలుసుకోండిలా..

కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో రైతుల కోసం కూడా కొన్ని పథకాలను ప్రవేశ పెట్టింది.

PM Kisan: భార్యభర్తలిద్దరికి పీఎం కిసాన్ ప్రయోజనాలుంటాయా ? అర్హులెవరో తెలుసుకోండిలా..
Pm Kisan
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 19, 2021 | 11:11 AM

కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో రైతుల కోసం కూడా కొన్ని పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం. ఈ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రైతులకు రూ. 6 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా.. విడుతల వారిగా రూ.2000 చొప్పున రైతుల అకౌంట్‏లో జమ అవుతాయి.

ఇప్పటి వరకు 8 విడతలుగా రైతుల అకౌంట్‏లోకి నగదు జమ చేసింది ప్రభుత్వం. ఆగస్టు నెలలో 9వ విడత డబ్బులను ఇవ్వనున్నట్లుగా గత కొద్ది రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ డబ్బులు కేవలం పీఎం కిసాన్ పథకంలో రిజిస్టర్ చేసుకున్న రైతులకు మాత్రమే వస్తాయి. అయితే ఈ స్కీమ్ ప్రారంభమైన ఇన్ని రోజులకు ప్రజలలో అనేక సందేహాలున్నాయి. ఒక కుటుంబంలోని భార్యభర్తలిద్దరూ ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం.. కుటుంబంలోని ఒక వ్యక్తి మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఇంట్లోని భార్యభర్తలిద్దరికి ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందలేరు. ఒకవేళ ఎవరైనా నియమాలను ఉల్లంఘించి ఇద్దరి పేర్లు నమోదు చేసుకున్నట్లైతే.. వారు ఈ పథకం నుంచి మినహాయించబడతారు. అనంతరం వారు రైతులుగా అనర్హులు అవుతారు.

అర్హుల వివరాలు..

1. వ్యవసాయం కాకుండా.. వేరే పని కోసం తమ వ్యవసాయ భూములను ఉపయోగిస్తున్న వారికి ఈ పథకం వర్తించదు. 2. అలాగే తమ సొంత భూమి కాకుండా.. ఇతర వ్యక్తుల భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు కూడా.. ఆ భూమి యాజమానులు కూడా ఈ పథకానికి అనర్హులు. 3. వ్యవసాయ భూములు అతను, ఆమె పేరుతో రిజిస్టర్ కాకపోతే సదరు వ్యక్తి ఈ పథకానికి అనర్హుడు. 4. అంతేకాకుండా.. వ్యక్తి తండ్రి లేదా తాతా పేరుతో భూమి రిజిస్టర్ అయి ఉంటే.. ఈ పథకం వర్తించదు. 5. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వ్యవసాయ భూముల యజమానులకు ఈ పథకం చెల్లదని ప్రకటించబడుతుంది. 6. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఈ పథకానికి అనర్హులు.

Also Read: Rajendra Prasad: ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే హీరో.. నటకీరిటి రాజేంద్ర ప్రసాద్ బర్త్ స్పెషల్..

Mahesh Babu: క్రేజీ ప్రాజెక్టుకు అంతా సిద్ధం.. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో మహేష్‌ బాబు సినిమా.. దర్శకుడు ఎవరంటే.?