AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office Scheme: నెలకు రూ.1000తోనే రూ. 8లక్షలు సంపాదించే అవకాశం.. పైగా పూర్తిగా పన్ను రహితం..

పథకం 15 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. మీరు దీని నుంచి మరింత ప్రయోజనం పొందాలనుకుంటే, మీ ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. పీపీఎఫ్‌లో ఏటా రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం దానిపై 7.1 శాతం వడ్డీ ఇస్తోంది.

Post Office Scheme: నెలకు రూ.1000తోనే రూ. 8లక్షలు సంపాదించే అవకాశం.. పైగా పూర్తిగా పన్ను రహితం..
Post Office
Madhu
|

Updated on: May 15, 2024 | 5:47 PM

Share

మీరు ఏదైనా మంచి పథకంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటన్నారా? అది మీరు వెచ్చించే ప్రతి రూపాయి తిరిగి అధిక మొత్తంలో రాబడి రావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ఈ పథకంలో పెట్టుబడికి గ్యారంటీ వడ్డీతో రాబడిని అందించే బెస్ట్ స్కీమ్ ను మీకు అందిస్తున్నాం. దీనిలో కచ్చితమైన రాబడి అందుతుంది. పైగా ప్రభుత్వ భరోసా కూడా ఉంటుంది. అదే పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉంటుంది. ఆ పథకం పేరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్). ఇది ప్రభుత్వం హామీనిచ్చే పథకం. ఇందులో దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుతాయి. ఎక్కువ కాలం పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది. దీనిలో నెలకు మీరు రూ. 1000 పెట్టుబడి పెడుతూ ఉంటే మెచ్యూరిటీ సమయానికి రూ. 8లక్షల కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

15ఏళ్లకు మెచ్యూరిటీ..

పథకం 15 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. మీరు దీని నుంచి మరింత ప్రయోజనం పొందాలనుకుంటే, మీ ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. పీపీఎఫ్‌లో ఏటా రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం దానిపై 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. ఈఈఈ కేటగిరీకి చెందిన ఈ పథకంలో, వడ్డీని కూడా మూడు మార్గాల్లో ఆదా చేసుకోవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఏదైనా పోస్టాఫీసు లేదా ప్రభుత్వ బ్యాంకులో ఖాతా తెరవవచ్చు. మీరు ఈ పథకంలో నెలకు కేవలం రూ. 1,000 పెట్టుబడి పెడితే, మీరు కొన్ని సంవత్సరాలలో రూ. 8 లక్షల కంటే ఎక్కువ జోడించవచ్చు.

8 లక్షలకు పైగా ఎలా..

ఈ పథకంలో ప్రతి నెలా రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే, ఏడాదికి రూ.12,000 ఇన్వెస్ట్ చేస్తారు. స్కీమ్ 15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. అయితే మీరు దీన్ని ఒక్కొక్కటి 5 సంవత్సరాల బ్లాక్‌లలో రెండుసార్లు పొడిగించాలి. 25 సంవత్సరాల పాటు నిరంతరంగా పెట్టుబడిని కొనసాగించాలి. 25 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే, మొత్తం రూ.3,00,000 ఇన్వెస్ట్ చేస్తారు. కానీ 7.1 శాతం వడ్డీ ప్రకారం, మీరు వడ్డీ నుంచి రూ. 5,24,641 మాత్రమే తీసుకుంటారు. మీ మెచ్యూరిటీ మొత్తం రూ. 8,24,641 అవుతుంది.

మూడు మార్గాల్లో పన్ను ఆదా..

పీపీఎఫ్ అనేది ఈఈఈ కేటగిరీ పథకం, కాబట్టి మీరు ఈ పథకంలో 3 రకాలుగా పన్ను మినహాయింపు పొందుతారు. ఈఈఈ అంటే మినహాయింపు మినహాయింపు మినహాయింపు. ఈ కేటగిరీలోకి వచ్చే పథకాలలో, ఏటా డిపాజిట్ చేసిన మొత్తంపై పన్ను ఉండదు, ఇది కాకుండా, పథకంలో ప్రతి సంవత్సరం సంపాదించిన వడ్డీకి పన్ను విధించరు. మెచ్యూరిటీ సమయంలో అందుకున్న మొత్తం కూడా పన్ను రహితం అంటే పెట్టుబడి, వడ్డీ, రాబడి మూడింటిలోనూ పన్ను ఆదా అవుతుంది.

పొడిగింపు నియయం ఇలా..

పీపీఎఫ్ ఖాతా పొడిగింపు 5 సంవత్సరాల బ్లాక్‌లలో జరుగుతుంది. పీపీఎఫ్ పొడిగింపు విషయంలో, పెట్టుబడిదారుడికి రెండు రకాల ఎంపికలు ఉన్నాయి. మొదటిది, కంట్రీబ్యూషన్ కడుతూనే ఖాతా పొడిగింపు. రెండవది, పెట్టుబడి లేకుండా ఖాతా పొడిగింపు. మీరు కంట్రీబ్యూషన్ కడుతూనే పొడిగింపు పొందాలనుకుంటే మీరు ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసుకు దరఖాస్తును సమర్పించాలి. మెచ్యూరిటీ తేదీ నుంచి 1 సంవత్సరం పూర్తికాకముందే మీరు ఈ దరఖాస్తును అందించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..