AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pensioners: పెన్షన్ సమస్యలపై టెన్షన్ వద్దు.. ఇలా చేస్తే వెంటనే పరిష్కారం..

కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు పెన్షన్‌లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా.. బ్యాంకు, సంబంధిత ప్రభుత్వ శాఖలకు పదే పదే ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోయినా.. వెంటనే ఆన్ లైన్లోనే ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. దీని ద్వారా ఫిర్యాదులను సంబంధిత శాఖలోని సీనియర్ అధికారులకు తెలియజేయడానికి వీలుంటుంది. మీ సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది.

Pensioners: పెన్షన్ సమస్యలపై టెన్షన్ వద్దు.. ఇలా చేస్తే వెంటనే పరిష్కారం..
Pension Scheme
Madhu
|

Updated on: Mar 11, 2024 | 12:45 PM

Share

సీనియర్ సిటిజన్లు తమకు నెలావారీ వచ్చే పెన్షన్లపై ఆధారపడతారు. వాటిలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఆందోళన చెందుతారు. వాటి పరిష్కారానికి ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియదు. సమస్యను స్థానికంగా అధికారులకు చెబితే వారు సరిగ్గా పట్టించుకోక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆందోళనా అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు పెన్షన్‌లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నా.. బ్యాంకు, సంబంధిత ప్రభుత్వ శాఖలకు పదే పదే ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోయినా.. వెంటనే www.pensionersportal.gov.in ద్వారా కూడా ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. దీని ద్వారా ఫిర్యాదులను సంబంధిత శాఖలోని సీనియర్ అధికారులకు తెలియజేయడానికి వీలుంటుంది. మీ సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది.

పీపీఓ నంబర్ చాలా ముఖ్యం..

ఇప్పటి వరకూ మీ పెన్షన్ సమస్యపై అధికారుల స్పందనలు సంతృప్తికరంగా లేనప్పుడు, పెన్షన్ సంబంధిత ఆందోళనలకు సంబంధించి ఎవరిని సంప్రదించాలో తెలియనప్పుడు దీనిని ఉపయోగించుకోవచ్చు. అయితే ఫిర్యాదు నమోదు చేయడానికి పోర్టల్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మీ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (పీపీఓ) నంబర్‌ చాలా అవసరం. ఇది మీ ఫిర్యాదుపై ప్రభుత్వం తక్షణమే దృష్టిని కేంద్రీకరించేందుకు దోహద పడుతుంది.

వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేసే విధానం..

  • www.pensionersportal.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి, గ్రీవెన్స్ పై క్లిక్ చేయండి.
  • పెన్షన్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ ను ఎంపికను ఎంచుకుని, వివరాలను చదవడానికి దానిపై క్లిక్ చేయండి.
  • మీకు పెన్షన్ విషయాలలో ఏవైనా ఫిర్యాదులు ఉంటే, మీ హెడ్ ఆఫ్ ఆఫీస్, పెన్షన్ మంజూరు చేసే అధికారి లేదా పింఛను పంపిణీ చేసే అధికారిని సంప్రదించవచ్చు.
  • అవసరమైతే, మీరు పెన్షన్, పింఛనుదారుల సంక్షేమ శాఖ, లోక్ నాయక్ భవన్ (3వ అంతస్తు), ఖాన్ మాకేట్, న్యూఢిల్లీ-110003ని కూడా సంప్రదించవచ్చు. ఇది పెన్షనర్లు సెక్రటరీ ఫిర్యాదులు, సమస్యలను పరిశీలించడానికి నోడల్ డిపార్ట్‌మెంట్ (పీజీ), డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్స్, క్యాబినెట్ సెక్రటేరియట్, సర్దార్ పటేల్ భవన్, పార్లమెంట్ స్ట్రీట్, న్యూఢిల్లీ-110001 చిరునామాలో ఉంది.

పేరు, పూర్తి చిరునామా, పదవీ విరమణ పొందిన కార్యాలయం, పదవీ విరమణ సమయంలో నిర్వహించిన పోస్ట్, పే స్కేల్, పీపీఓ జారీ చేసిన అకౌంట్స్ ఆఫీసర్ వివరాలు, పెన్షన్ పంపిణీ అథారిటీ వివరాలు, పీపీఓ నంబర్ / పీపీఓ ఫోటోకాపీ వంటి వివరాలన్నీ సక్రమంగా ఉంటే సమస్యను తక్షణం పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. గత రికార్డులను సులభంగా పరిశీలించగలుగుతారు.

ఇవి కూడా చదవండి

కమిటీ ఏర్పాటు..

ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని సమీక్షించేందుకు గత ఏడాది ఏప్రిల్‌లో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పీఎస్) ప్రస్తుత ఫ్రేమ్‌వర్క్, నిర్మాణం దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే విధంగా, అందులో ఏవైనా మార్పులు అవసరమా అని కమిటీ సూచిస్తుంది.

ప్రయోజనాలు మెరుగు..

నిబంధనల ప్రకారం ఆర్థికపరమైన చిక్కులు, మొత్తం బడ్జెట్ పై ప్రభావాన్నికమిటీ దృష్టిలో ఉంచుకుంటుంది. ఎన్‌పీఎస్ కింద కవర్ చేయబడిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనరీ ప్రయోజనాలను మెరుగుపరిచే ఉద్దేశంతో వాటిని సవరించే చర్యలను సూచిస్తుంది. సోమనాథన్ అధ్యక్షతన ఉండే ఈ కమిటీలో పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ (డీఓపీటీ), వ్యయ శాఖ ప్రత్యేక కార్యదర్శి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్డీఏ) చైర్మన్ సభ్యులుగా ఉంటారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..