Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onions Price: కేంద్ర నిర్ణయంతో భారీగా దిగి వస్తున్న ‘ఉల్లి’ ధర

ఎన్‌సిసిఎఫ్ కిలో ఉల్లిపాయలను 25 రూపాయలకు రాయితీపై విక్రయించనున్నట్లు ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ శనివారం ఉదయం ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దేశం నుంచి ఎగుమతి చేసే ఉల్లిపై 40 శాతం భారీ సుంకం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎగుమతులపై ఈ నిషేధం 31 డిసెంబర్ 2023 వరకు అమలులో ఉంటుంది..

Onions Price: కేంద్ర నిర్ణయంతో భారీగా దిగి వస్తున్న 'ఉల్లి' ధర
Onion Price
Follow us
Subhash Goud

|

Updated on: Aug 20, 2023 | 6:33 PM

ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం నిరంతరం జోక్యం చేసుకుంటోంది. ఈ కారణంగానే నెలరోజుల పాటు సామాన్యులకు చౌక ధరలకు టమాటా అందుబాటులోకి వస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉల్లిని తక్కువ ధరకు తీసుకురానుంది. దీని కింద ప్రజలకు కిలో ఉల్లి 25 రూపాయలకు లభించనుంది. గిట్టుబాటు ధరతో ఉల్లిపాయల విక్రయం ఆగస్టు 21 సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. తక్కువ ధరల్లో ఉల్లి విక్రయించేందుకు సహకార ఏజెన్సీ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చేస్తుంది.

సోమవారం నుంచి ఎన్‌సిసిఎఫ్ కిలో ఉల్లిపాయలను 25 రూపాయలకు రాయితీపై విక్రయించనున్నట్లు ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ శనివారం ఉదయం ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దేశం నుంచి ఎగుమతి చేసే ఉల్లిపై 40 శాతం సుంకాన్నివిధించాలని మోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఎగుమతులపై ఈ నిషేధం 31 డిసెంబర్ 2023 వరకు అమలులో ఉంటుంది.

ఉల్లి ధరల పెరుగుదల భయాన్ని తొలగించే ప్రయత్నాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ చర్య కనిపిస్తుంది. టమాటా తర్వాత ఉల్లి కూడా సామాన్యుల కష్టాలను పెంచుతుందని, సెప్టెంబర్ నుంచి వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న నెలల్లో పండుగల సీజన్‌లో ద్రవ్యోల్బణం ప్రజలను పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు వేగవంతం చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం బఫర్ స్టాక్‌ను పెంచుతోంది:

ఉల్లి ధరలను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం తన బఫర్ స్టాక్ పరిమితిని కూడా పెంచింది. గతంలో ఉల్లిపాయల బఫర్ పరిమితిని 3 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించారు. నిర్ణీత లక్ష్యం మేరకు కొనుగోళ్లు జరిగాక ప్రభుత్వం ఇప్పుడు 5 లక్షల టన్నులకు పెంచింది. ప్రభుత్వం సహకార ఏజెన్సీలు ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్ రెండింటినీ అదనంగా 1 లక్ష టన్నులు కొనుగోలు చేయాలని కోరింది.

బఫర్ స్టాక్ నుంచి సరఫరా..

మరోవైపు ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని మార్కెట్‌కు పంపడం ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారు 1,400 టన్నుల ఉల్లిపాయలు రిజర్వ్‌ నుంచి మార్కెట్‌కు వచ్చాయి. దేశీయ మార్కెట్‌లో ఉల్లి డిమాండ్‌ను తీర్చడంతోపాటు తగినన్ని లభ్యత ఉండేలా చూడడంతోపాటు దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలు టమాటా లాగా ఆకాశాన్నంటకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతోంది.

ఇంతకు ముందు టమాట ధరలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఒక్కసారిగా టమాట ధరలు కిలో రూ.200-250కి చేరాయి. ఆ తర్వాత ఎన్‌సీసీఎఫ్‌, ఎన్‌ఏఎఫ్‌ఈడీ తక్కువ ధరకు టమోటాలను విక్రయించడం ప్రారంభించాయి. గతంలో టమాట కిలో రూ.90కి విక్రయించేవారు. ఇప్పుడు నేటి నుంచి దాని ధరలు కిలో రూ.40కి తగ్గాయి. టమోటాలు, ఇతర కూరగాయల ధరల పెరుగుదల కారణంగా జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7 శాతం దాటింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి