AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: బడ్జెట్‌‌పైనే మిడిల్ క్లాస్ ప్రజలఆశలన్నీ.. పన్ను విధానాల్లో మినహాయింపులు.?

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చే నెలలో బడ్జెట్‌ను సమర్పించనుంది. బీజేపీతో పాటు దాని కూటమి పార్టీల నుంచి 72 మంది సభ్యులు క్యాబినెట్, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టునున్నారు. జూలైలో ఆమె 6వ పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేందుకు మార్గం సుగమం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను కూడా సమర్పించారు.

Budget 2024: బడ్జెట్‌‌పైనే మిడిల్ క్లాస్ ప్రజలఆశలన్నీ.. పన్ను విధానాల్లో మినహాయింపులు.?
Budget 2024
Nikhil
| Edited By: TV9 Telugu|

Updated on: Jun 18, 2024 | 5:25 PM

Share

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చే నెలలో బడ్జెట్‌ను సమర్పించనుంది. బీజేపీతో పాటు దాని కూటమి పార్టీల నుంచి 72 మంది సభ్యులు క్యాబినెట్, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టునున్నారు. జూలైలో ఆమె 6వ పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేందుకు మార్గం సుగమం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను కూడా సమర్పించారు. ఈ సారి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ – 2024 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

నూతన బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం తమకు పన్ను మినహాయింపు ఇస్తుందని పన్ను చెల్లింపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 80 సీ, 80డీ కింద మినహాయింపు పరిమితుల్లో సీతారామన్ సవరణ చేస్తారని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చివరిసారిగా 2014-15 కేంద్ర బడ్జెట్‌లో సెక్షన్ 80సీ కింద మినహాయింపు పరిమితిని సవరించింది. ఈ సెక్షన్ కింద పన్ను ప్రయోజనాల కోసం రూ. 1.5 లక్షల నుంచి రూ. 1 లక్షకు పెంచింది. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు మినహాయింపు ప్రయోజనాల పరంగా 80సీ అత్యంత కీలకమైన విభాగం. సెక్షన్ 80సీ కింద పన్ను చెల్లింపుదారులు పీపీఎఫ్, ఎన్‌పీఎస్, చిన్న పొదుపులు, జీవిత బీమా, ఈఎల్ఎస్ఎస్, యూలిప్‌లు, హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ అనేక ఇతర పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. 

కొత్త ప్రభుత్వంలో పన్ను చెల్లింపుదారులు స్పష్టమైన, మరింత సమర్థవంతమైన పన్ను వ్యవస్థ కోసం సంస్కరణలను ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పన్ను స్లాబ్‌లను తగ్గించడంతో పాటు మినహాయింపులను క్రమబద్ధీకరించడం వంటి సాధారణ ప్రజలకు సమ్మతిని సులభతరం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడంతో పాటు పారదర్శకతను మెరుగుపరచడానికి పన్ను విధానంలో డిజిటల్ సిస్టమ్‌ను పెంచేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా స్కూల్ ఫీజులపై మినహాయింపు సెక్షన్ 80సీ నుంచి మినహాయింపును ఇస్తారని చెబుతున్నారు. అలాగే బీమాను ప్రోత్సహించేందుకు అందుబాటులో ఉన్న యూ/ఎస్‌ 80డీ తగ్గింపును ప్రస్తుతం ఉన్న రూ. 25,000 నుంచి రూ. 75,000కి పెంచవచ్చని వివరిస్తున్నారు. పన్ను దాఖలు ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను చెల్లింపుదారులపై పరిపాలనా భారాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి