Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రోజే డీఏ పెంపు ప్రకటన

జనవరి, జూలై నెలల్లో డీఏ పెంపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పొందుతున్నారు. మార్చి 2023లో చివరి పెంపులో డీఏ 42 శాతానికి పెరిగింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటును బట్టి వివిధ నివేదికల ప్రకారం తదుపరి డీఏ పెంపు 4 శాతంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ డీఏ పెంపు వార్త దసరా లేదా దీపావళి మధ్య కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రోజే డీఏ పెంపు ప్రకటన
Da Hike
Follow us
Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 30, 2023 | 6:34 PM

భారతదేశంలో వేతన జీవుల శాతం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రైవేట్‌ ఉద్యోగుల సంఖ్య పక్కన పెడితే దేశవ్యాప్తంగా ప్రస్తుతం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ ఇస్తారు. డీఏ, డీఆర్‌ సంవత్సరానికి రెండుసార్లు పెంచుతారు. జనవరి, జూలై నెలల్లో డీఏ పెంపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పొందుతున్నారు. మార్చి 2023లో చివరి పెంపులో డీఏ 42 శాతానికి పెరిగింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటును బట్టి వివిధ నివేదికల ప్రకారం తదుపరి డీఏ పెంపు 4 శాతంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ డీఏ పెంపు వార్త దసరా లేదా దీపావళి మధ్య కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సారి ప్రకటించిన డీఏ పెంపు జూలై 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. మునుపటి నివేదికలు 3 శాతం డీఏ పెంపును సూచించినప్పటికీ ఈ శాతం పెరిగే అవకాశం ఉంది. 

పారిశ్రామిక కార్మికుల కోసం తాజా వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా డీఏ లెక్కింపు ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం పెంపు అవకాశం ఉంది. ఈ పెంపు తర్వాత కరువు భత్యం 46 శాతానికి చేరుతుంది. ఇటీవల మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచాయి.

డీఏ పెంపుపై ప్రభుత్వ నిర్ణయం ఇలా

జూన్ 2022తో ముగిసే కాలానికి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) 12 నెలవారీ సగటు పెరుగుదల శాతం ఆధారంగా డీఏ, డీఆర్‌ పెంపు నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 తేదీల్లో అలవెన్సులను సవరిస్తుంది. అయితే నిర్ణయం సాధారణంగా మార్చి, సెప్టెంబర్‌లో ప్రకటిస్తారు. 2006లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌లను లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్ములాను సవరించింది.

డీఆర్‌ లెక్కింపు సూత్రం

డియర్‌నెస్ అలవెన్స్ శాతం = ఆల్-ఇండియా వినియోగదారుల ధరల సూచిక (ఆధార సంవత్సరం 2001=100) గత 12 నెలల సగటు -115.76)/115.76)x100.

కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం

డియర్‌నెస్ అలవెన్స్ శాతం = ((ఆల్-ఇండియా వినియోగదారుల ధరల సూచీ (ఆధార సంవత్సరం 2001=100) గత 3 నెలలుగా -126.33)/126.33)x100.

నితిన్ హీరోయిన్ ఎంతలా మారిపోయింది..
నితిన్ హీరోయిన్ ఎంతలా మారిపోయింది..
పూజలో కలశంలో మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా
పూజలో కలశంలో మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా
భర్త ఎంట్రీ.. ప్రియుడి ప్రైవేట్‌ పార్ట్‌ని పళ్లతో కసాకసా..
భర్త ఎంట్రీ.. ప్రియుడి ప్రైవేట్‌ పార్ట్‌ని పళ్లతో కసాకసా..
అడిగిన కట్నం ఇవ్వలేదని అలిగిన పెళ్లి కొడుకు.. ఏం చేశాడంటే..
అడిగిన కట్నం ఇవ్వలేదని అలిగిన పెళ్లి కొడుకు.. ఏం చేశాడంటే..
బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు కారణంగా ప్రభావితం అయ్యే అంశాలు ఏంటి..
బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు కారణంగా ప్రభావితం అయ్యే అంశాలు ఏంటి..
రామ్ చరణ్‌ వల్ల డిలే.. అల్లు అర్జున్ వల్ల పోస్ట్‌ పోన్..
రామ్ చరణ్‌ వల్ల డిలే.. అల్లు అర్జున్ వల్ల పోస్ట్‌ పోన్..
శనివారం ఈ నూనెతో శనిశ్వరుడికి పూజ చేయండి.. అనుగ్రహం మీ సొంతం
శనివారం ఈ నూనెతో శనిశ్వరుడికి పూజ చేయండి.. అనుగ్రహం మీ సొంతం
బాహుబలి వివాహ వేదిక.. 5000 జంటలకు ఒకేసారి పెళ్లి.. ఎక్కడంటే..
బాహుబలి వివాహ వేదిక.. 5000 జంటలకు ఒకేసారి పెళ్లి.. ఎక్కడంటే..
మంచి పిల్లను చూసి పెళ్లాడాలనుకున్న తెలుగు ఎన్ ఆర్ ఐ.. కట్ చేస్తే
మంచి పిల్లను చూసి పెళ్లాడాలనుకున్న తెలుగు ఎన్ ఆర్ ఐ.. కట్ చేస్తే
ఒక్క విజయంతో పాయింట్ల పట్టికనే షేక్ చేసిన పంత్ సేన
ఒక్క విజయంతో పాయింట్ల పట్టికనే షేక్ చేసిన పంత్ సేన